Friday, April 24, 2009

రోగాలు-మార్గము

పిల్లల వ్యాధులు:

[1].పుట్టిన మూడు రోజులలో గాడిద పాలు త్రాగించిన శిశువులకు శ్లేష్మ దోషములు రావు.
[2].పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
[3].నేలతాడి చూర్నమును వాము తో పూచుకోనిన దగ్గు నివ్రుతిఅగును . కఫముతో కూడిన దగ్గుకు నేఅతాది చూనమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను. [4].ఎండిన సదాపాకుతో పోగావేసిన బిడ్డలా దగ్గు తగ్గును. [5].వసహో తేలిక కషాయము చేసి బిడ్డలకు అబ్యాన స్నానము చేయించిన మూర్చ పోవును.
[6].వస నో నీలతో గానీ సారాయితో గానీ నూరి శిశువుల రోమ్మునకు పట్టించిన దగ్గు శ్లేష్మము హరించును.
[7].కుప్పింతకు రసం తీసి ఒక స్పూన్ లో ఒక ఉప్పు రాయిని నూరి కలిపి త్రాగించిన పిల్లల కడుపు నొప్పి తగ్గును.
[8].20 చుక్కల ఉల్లిగడ్డ రసము మూడింతల మోతాదు తేనె , తేనెకు సమమైన నీలను కలిపి రోజుకు 3 ,4 సర్లిచిన చంటి పిల్లల కోరింత దగ్గు నివృతి యగును .మేడలో ఉల్లి గడ్డాల దండను వేయవలెను. [9].వడగట్టిన గో మూత్రము 2 తులములలో కొంచెము ఉప్పు కలిపి త్రాగించిన పిల్లలు ప్రక్కలు ఎగురవేయుట తగ్గిపోవును .
[10].శేని వారము నాడు సూర్యోదయము కాకా మునుపే ఈనిన ఆవు యొక్క పేడను తెచ్హి క్రుశించుచున్న పిల్ల వీపు ఫై మర్దన చేసి కొదిసేపటి తరువాత కడిగిన వీపు ఫై కొన్ని ముళ్ళ వలె పై కి లేవును.వీటిని తొలిగించి స్నానము చేయించవలెను.ఈ విధముగా 2 ,3 సార్లు జరిపిన పిఇల్లల యందు రోగము పోవును.
[11].అతి వస చూర్ణము ఒక చిన్నమును బియ్యపు కుగుతో కలిపి త్రాగించిన చిన్నపిల్లలా విరేచనములు తగ్గును.
[12].ఇంగువను నీలతో అరగదీసి కడుపు ఫై లేపనము చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును.
[13].ఏలకులు గింజలు , దాల్చిన చెక్క , సమబాగాలుగా , కలిపి పొడి చేసి అందు ఒక గ్రాము యేతు పొడిని తేనె తో కలిపి తినిపించు చుండిన వాంతులు తగ్గును .
[14].పోగ్గించిన ఇంగువ , నల్ల ఉప్పు సమపాళ్ళలో కలిపి పొడిచేసి పూటకు చిన్నం చొప్పున కడిగి తినిపించుచుండిన చిన్నపిల్లలా కడుపు ఉబ్బరం తగ్గును.
[15].సునముకి , కరక్కాయ పెచులు , రేలా గుజ్జు సమపాళ్ళలో కలిపి నూరి కందుల వలె టాబ్లెట్ చేసి ఉదయం , సాయంత్రం ఒక మాత్ర ఇచ్హిన పిల్లల కడుపు ఉబ్బరం ఎటువంటి వైనను తగ్గి పోవున్ .
[16].తమలపాకులకు ఆముదము రాసి వేఛ జేసి రొమ్ము ఫై , పొట్ట పై , తల పైన ను పెట్టు చుండిన పిల్లల జలుబు తగ్గి పోవును .
[17].ఒక గురిగింజ ఏతు మైల తూతమును 3 తులముల మంచి నీటిలో కలిపి ఇచ్హిన వంతులై వాయువు హరించును.
[18].బాల పాప చిహ్నాలకు నవాసాగారము సున్నము కలిపి వాసన చూపించావలెను.

అతి మూత్రము:

[1].వేసవి కాలంలో మామిడి పిందెలు చెట్ల నుంచి రాలి పోతున్టై.వాటిని గాని లేక చెట్ల నుంచి తెంపి గాని ఎండ బెట్టి పోదిచేఎలి . బాగా చిన్న పిందెలు మాత్రము పొడి చేయుటకు వీలవుతుంది . అలా తయారుచేసిన పిందెల పిండికి 2 సార్లు పంచదార కలిపి సీసాలో బాధ్రపరుచుకుని రోజు ఉదయం పూట 2 చిన్న స్పూన్ల పోడుమును తినాలి . తినటాని వీలు పడక పోతే కప్పు నీటిలో కలిపి త్రాగా వచును.ఇలా నెల రోజులు చేసిన అతి మూత్రము తగ్గి పోతుంది.
[2].ముదురు వేప చెక్క చూర్ణము 5 gm , పంచదార 3gm , ఈ రెండు ఒక గ్లాసులో కలిపి ఒక మోతాదుగా 2పూటలా తాగుతూ వుంటే అతి మూత్రము హరించి పోతుంది.


ఆకలి:

[1].ఒక చిన్న గ్లాస్ అల్లం రసం , ఒక చిన్న గ్లాస్ నిమ్మ రసం , ఒక చిన్న గ్లాస్ పాతిక బెల్లం పొడి ఈ నాలుగింటిని సమంగా తీసుకుని ఒక పాత్రలో పోసి సన్న మంట మీద తీగ పాకం వచ్చే వరకు ఉడికించి చల్లార్చి ఒక గాజు పాత్రలో బదర పరిచి , రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక స్పూన్ పాకం సేవించిన ఆకలి పెరుగును. [2].2gm ల అల్లములో కొంచెము ఉప్పు ను ఉధయమందే తిన వలెను.
[3].5gmశొంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీలతో కలిపి పుచుకోనవలెను.
[4].పిప్పళ్ళు ,చిత్రమూలము , వాయు విదంగములు , గానుగ గింజల పప్పు , కరక్కాయ పెచులు సమపాళ్ళల్లో పొడి చేసి కలిపి దానికి 2 బాగాలు పాతిక బెల్లంపొడి ని కలిపి నూరి మిరియములంత ఉండలను చేసి పూటకొక మంచి నీటి అనుపానముతో సేవించవలెను.
[5].ఉప్పు , శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద లో 5gm పొడి కలిపి తింటూ ఉంటె నాలుక , గొంతు శుబ్రమై కఫము తగ్గి , ఆకలి పెరిగి ,ఆహరం బాగా జీర్ణమై వంటపడుతుంది.


విరిగిన ఎముకలు:

[1].నల్లేరు కాడలు కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి 10 - 20 gm మోతాదుగా సేవిస్తూ వుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటై.రసమును వేఛ జేసి త్రాగిన విరిగిన ఎముకలు అతుక్కోనును.

గ్యాస్ TROUBLE:

[1].వాము 50gm , మిరియాలు 50 gm , ఉప్పు 25 gm , వీటిని దోరగా వేయించి దంచి చూర్ణం చేసి ఆహారం తరువాతోక టీ స్పూన్ మోతాదుగా మంచి నీటితో వాడవలెను.

ఫిట్స్:

[1].కుంకుడు రసం గుడ్డలో వడగట్టి , ఆ రసాన్ని ఫిట్స్ , అపస్మారము వచ్చి తెలివి తప్పి పది ఉన్న రోగికి ముక్కుల్లో 2 , 3 చుక్కలు వేస్తె వెంటనే ఆ ఉపద్రవం నుండి కోలుకుంటారు , ఫిట్స్ లేనప్పుడు కూడా నలగగొట్టిన కుంకుడు ముక్కలా వాసన చూస్తూ వుంటే మూర్చ హరించి పోతుంది.

మలబధకం:

[1].దాల్చిన చెక్క కరక్కాయ బెరడు ఈ రెండు సమబాగాలుగా కలిపి కషాయం కాచి , 20 gm , మోతాదుగా సేవిస్తే సుక విరేచనం అయి మలబధకం మాయమిపోతుంది.

కుష్టు:

[1].ఆరు సంవత్సరముల వయస్సుగల వేప చెట్టును తొలిచి అందులో స్హేరు బియ్యమును అన్నముగా వండి ఆ వేడి అన్నమును ఉంచి (పోసి) అదే చెట్టు కర్రతో తోర్రను మూసి దానిపై ఆవు పేడను పూసి సంవత్సరము పిమ్మట తీసి ఆ అన్నమును ఎండించి పూటకు పావలా యేతు చొప్పున 40 రోజులు రోగికి 2 పూటలా తినిపించావలెను. [2].బ్రహ్మ దండి ఆకు రసమున వాసను మర్దించి రాసిన అన్ని రకముల కుష్టులు నివారనమగును .
[3].బావంచాలు , నువ్వులు సమబగములు కలిపి పొడి చేసి పూటకు 6gm చొప్పున మంచి నీటి అనుపనముతో 1 సంవత్సరము సేవించిన 18 రకముల కుష్టు వ్యాధులు హరించును.
[4].కరక్కాయ పెచులు , శుద నల్ల జీడి గింజలు , నువ్వులు , బెల్లము సమపాళ్ళల్లో కలిపి తొక్కి గచ కాయలంత ఉనడలను చేసి పూతకొక్కటి చొప్పున పూచుకోనిన కుష్టు వ్యాధి మొదలంట రూపుమాయును.
[5].అడ్డరస ఆకు , చేదు పొట్ల , కరక , తాడి , ఉసిరికలు , తిప్ప తీగ ఆకు చూర్ణము సమపాళ్ళల్లో కలిపి పూటకు పావు తులము , చొప్పున నెయ్యిలో కలిపి మూడు నేలలలు సేవించవలెను.
[6].ఆగాకర పువ్వుల రసమును పూయవలెను .
[7].వాయువిదంగాలు , కరక్కాయ బెరడు , సైంధవ లవణము , బావంచాలు , తెల్లవాలు , కానుగావితులు వీటిని సమబాగాలుగా తీసుకుని గోమూత్రములో మెతగా మర్దించి , శరీరానికి పట్టిస్తూ వుంటే కుష్టు వ్యాధి హరించి పోతుంది . [8].కానుగ గింజలు , కోడిశాపాల గింజలు , సమంగా కలిపి మెతగా నూరి లేపనం చేస్తూ ఉంటె క్రమంగా కుష్టు వ్యాధి హరించి పోతుంది.
[9].ఎర్రగా వుండే వేప లేత చిగురాకులుపది వరకు తీసుకుని వాటితో పాటు మూడు మిరియాలు కలిపి దంచి ఆ ముదను తింటూ ఉంటె కొన్ని మాసాలకు దారుణమైన కుష్టు రోగాలు హరించి పోతాయి .

బోదకాలు:

[1].పాతబెల్లము , మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm, మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని , రెండు పూటలా తాగుతూ వుంటే క్రమంగా బోధ కాలు , కుష్టు , అతి దాహము తగ్గిపోతాయి.
[2].గససాలు , శొంటి , కరక కాయల బెరడు , ఈ మూడు ఒక్కొక్కటి ౫౦గ్మ , తేగాడ 150gm , కలిపి చూర్ణం చేసి ఆ మొతానికి సమ బాగంగా బెల్లం కలిపి దంచి నిలవ చేసికొని , రోజూ పూటకు 10gm ,మోతాదుగా సేవిస్తూ వుంటే బోధ కాళ్ళు బోధ జ్వరాలు హరిన్చిపోతై .


ఉబ్బసం :

[1].వాకుడు చెట్టు సమూలము , అడ్డరసం ఆకులు , ఉత్హరేణి చెట్టు సమూలం , పొగాకు ఈ నాలుగు పదార్దములు సమబగాములుగా గ్రహించి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి , ఆ బూడిదను నాలుగు రెట్లు మంచి నీళ్ళు పోసి 3 రోజులు నిలువ వుంచవలెను . ప్రతి రోజు కర్రతో 3 సార్లు కలుపుతూ ఉండాలి .4 వ రోజు కుండలో పైన పేర్కొన్న తేట నీటిని వంచుకుని , కళాయి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే అది క్రమంగా గానీబవించి పాత్ర అడుగున ఉప్పు లాగా పేరుకుంటుంది దాన్ని తీసి ఒక గాజు పాత్రలో నిలవ చేసుకుని రోజు పూటకు రెండు గురిగింజలంత తూకం పొడిలో ఒక స్పూన్ తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ వుంటే , కఫము తెగి పడిపోయి ఉబ్బసం హరించి పోతుంది.
[2].వాకుడు పండ్లు , పిప్పళ్ళు , గంతుబరంగి , లవంగాలు , శొంటి వీటిని సమంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 3gm మోతాదుగా రోజు 3 పూటలా వేడి నీళ్ళల్లో కలిపి సేవిస్తూ వుంటే దగ్గు , ఉబ్బసం తగ్గుతాయి.
[3].చక్కర కేళి అరటి పండును గోమూత్రములో వేసి పిసికి రోజు ఉదయం పూట తింటూ ఉంటె దారుణమైన ఉబ్బసం కూడా తగ్గి పోతుంది.
[4].50gm బూడిద గుమ్మడి ఆకు రసములో చిటికెడు యవకశారము కలిపి తాగుతూ ఉబ్బసం తగ్గిపోతుంది .


డస్ట్ ఎలేర్జి :

[1].వాము మెతగా దంచి పలుచని గుడ్డలో మూటగట్టి , దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని , మాటిమాటికి వాసన చూస్తూ ఉంటె దుమ్ము వల్ల , తాలింపు వల్ల , ఘాటు వాసనా వాళ్ళ కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది .
[2].తులసి ఆకు నీడలో ఎండ బెట్టి పొడి చేసి , పలుచటి గుడ్డలో వాశ్రా గాలితం పట్టి నిలువ ఉంచుకో , రోజు 2 ,3 పూటలా కొంచెం పొడి ముక్కు పొడిల ముక్కుతో లోపలి పీలుస్తూ ఉండవలెను .
[3].మంచి శొంటి తేచి కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి , ఆ పొడి ఎంత తూకం వుంటే దానికి రెట్టింపు తూకం పాత బెల్లం కలిపి దంచి ఉదయం ,సాయంత్రం ఆహరం తరువాత 10gm ముద తింటూ వుంటే ఎలేర్జి సమస్య తప్పక పోతుంది .
[4].ఆకుపత్రి అంటే బిర్యాని లో వేసే ఆకు దాన్ని తేజ్ఫక్త్ అని కూడా అంటారు.ఈ ఆకు తేచి ఎండ బెట్టి పొడి చేసి ఆ పొడితో సమానంగా ఆయుర్వేద షాప్ లో దొరికే అతిమధురం పొడి కలిపి నిలువ వుంచుకోవాలి రోజు ఉదయం పరగడపున రాత్రి నిద్రపోయే ముందు అర గ్లాస్ ఆవు పాలల్లో అర టీ స్పూన్ పొడి కల్పుకొని తాగవలెను .ఇలా చేసిన మానసిక బలం కలుగుతుంది .


ముక్కు :

[1].వాము 10gm , పాత బెల్లం 40gm తీసుకుని రెండూ కలిపి దంచి ఆ ముదను అర లిటరే నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడ పోసి ఉదయం సాయంత్రం తాగాలి ఇలా 2,3 రోజులు చేస్తే జలుబు , పడిశం , శ్వాస సరిగా లేకపోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబధించిన సమస్యలు తీరటమే కాకా ఉదరం లోని గ్యాస్ తొలిగి అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి తిన్న ఆహరం బాగా వంట బట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది .

వాయిస్ :

[1].వాము , పసుపు , వస , పిప్పళ్ళు , మిరియాలు , సైంధవ లవణం , శొంటి వీటిని సమబాగాలుగా తీసుకోవాలి . వస తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించాలి .వాసను 24 గంటలు మంచి నీటిలో నన బెట్టి తీసి పొడి గుడ్డతో తుడిచి , ఎనబెట్టి దంచి పొడి చేసుకోవాలి .అన్ని పదార్ధాల చూర్నాలను కలుపుకుని నిలువ ఉంచు కోవాలి .రోజు పరగాదపున , రాత్రి నిద్ర పోయే ముందు 2 చిటికెల పొడిని ఒక చెంచ మంచి తేనె తో కలిపి తింటూ వుంటే క్రమంగా మీ గొంతు లోని కటినత్వము , బొంగురుథానము హరించి అతి మధురమైన శ్రావ్యమైన కంట ధ్వని మీ సొంతం అవుతుంది . [2].వస కొమ్ము 24 గంటలు మంచి నీటిలో నానబెట్టి తీసి గుడ్డతో తుడిచి ఎండబెట్టి , ఆ కొమ్ముతో గంధం తీసి , ఆ గంధం తేనె తో కలిపి పిల్లలకు నాకిస్తూ వుంటే , క్రమంగా నతి తగ్గి మాటలు స్పష్టంగా వసతి .
[3].బెల్లం , నెయ్యి సమంగా కలిపి 2 పూటలా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి కాంతం బాగు పడుతుంది.
[4].బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5gm మోతాదుగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గుతుంది.


గనేరియా:

[1].నేల ఉసిరాకు , తిప్పసతు , నగకేసరులు , మర్రి ఊడల చిగుర్లు , చలువ మిరియాలు వీటిని సమబగాలుగా చూర్ణం చేసి రోజు 3 పూటలా పూటకు 3 gm చూర్నమును కొంచెం పంచదారలో కలిపి పుచుకుంటూ వుంటే తెల్ల సెగ 15 రోజుల్లో పోతుంది .

TRANSILS:

[1].ఎల్లి పాయల , మిరియాలు , ఉత్హరేణి ఆకు ఈ మూడు సమబాగాలుగా దంచి బటాణి గిన్జలంత తబ్లెత్స్ చేసి రోజు 3 పూటలా పూటకు ఒక టాబ్లెట్ మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే క్రమంగా త్రంసిల్స్ కరిగి పోతాయి.

నిద్ర:

[1]నిద్ర బాగా పట్టుటకు ఆయుర్వేద షాప్ లలో దొరికే అశ్వగంధ పొడి తెచుకుని , దానితో సమానమగా తాటి బెల్లం కలిపి దంచి రోజు 2 పూటలా తింటూ ఒక కప్పు పాలు తాగుతూ ఉంటె మెదడుకు శరీరానికి శక్తి కలిగి పనికి మాలిన ఆలోచనలు రాకుండా వుంటాయి.
[2].ఎర్రముధం చెట్టు వేరు 10gm మోతాదుగా తీసుకుని నలగగొట్టి పావు లిటరే నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేల మరగబెట్టి , వడపోసి తాగుతూ వుంటే సుకంగా నిద్ర పడుతుంది.
[3].ఆముదపు చెట్టు పూవులను నూరి కనతలకు పట్టు వేసి , తలపైన కూడా వేసి కట్టు కడుతూ వుంటే అతి మగతగా వుండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అగును.
[4].బూడిద గుమ్మడి కాయలోని గింజలు సేకరించి , వాటిని గానుగలో పోసి తైలము తీయించాలి .ఆ తైలాన్ని రోజు రాత్రి నిద్ర పోయేముందు 10 gm తలకి పట్టించుకున్న లేక లోనికి పుచుకున్న ప్రశాంతమైన నిద్ర పడుతుంది.


రక్త విరేచనాలు:

[1].3gm బరువు తూగే వేప చిగుర్లు , 3gm పాతిక బెల్లం పొడి కలిపి ఒక మోతాదుగా 2 విరేచానములకు ఒక సారి తినిపిస్తూ వుంటే ఒక్క పూట లోనే రక్త విరేచనములు కట్టుకుంటాయి.
[2].మర్రి ఊడల రసం , జీలకర్ర చూర్ణము ఆవు పెరుగులో కలిపి 2 పూటలా తింటూ సేవించిన రక్త విరేచనములు తగ్గును.

చెవిలో పురుగు:

[1].నేల మీద నిద్ర పోయేటప్పుడు చిమితెల వంటి పురుగులు చెవులో దూరి బయటికి రాకుండా బాధిస్తాయి .అలాంటి స్థితిలో ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసం నలుగు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాల్లో ఆ పురుగులు చనిపోయి చెవి బాధ పోవును.

కలరా:

[1].ఉప్పు , మిరియాలు , జిల్లేడు పూవు సమ బాగాలుగా కలిపి మెతగా నూరి బటాని గిన్జలంత తబ్లెత్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 త్తబ్లేట్ట్స్ వేసుకుంటే కలరా హరిన్చిపోతుంది.
[2].పావు లీటర్ మంచి నీళ్ళలో ఆముదం వేసి తాగితే కలరా వెంటనే ఆగిపోతుంది.
[3].ఒక ఔన్సు మిరియాల కషాయములో ఆవగింజంత గోరోజనమును కలిపి పుచుకోనవలెను.
[4].జిల్లేడు పువ్వులను ఎదించిన గంటకు 3 గోధుమ గింజల ఎత్హు మంచి నీళ్ళల్లో సేవించవలెను.
[5].మంచు గడ్డను తరచుగా తినుచుండిన వాంతులు కట్టును.
[6].నల్లమందు , ఇంగువ , మిరియాలు ఒక్కొక్కటి 3gm చొప్పున నూరి 20 ఉండలను చేసి రోగ తీవ్రతను బట్టి ప్రతి గంటకు 1,2 ఇవ్వాఎను.
[7].మిరపకాయలను నిప్పులపై మాడ్చి అందులో నీళ్ళు పోసి కాచి వడపోసి ఇచ్హిన దాహము తగ్గి కలరా వాంతులు కట్టును.
[8].నెయ్యిని అనుదినము తిను వారికి కలరా త్వరగా దరిచేరదు.
[9].ముద హారతి కర్పూరము ప్రతి దినము గోధుమ గింజ అంత మింగుతూ వుంటే కలరా రాదూ. వచినదని అనుమానము కలిగిన నీటిలో ముద హారతి కర్పూరము కొంచెము కలిపి త్రాగించిన నీళ్ళ విరేచనములు తగ్గి పోవును

Monday, April 13, 2009

రోగాలు మార్గము

జలుబు:

[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది


దగ్గు:

[1].అరటి(బనానా) పండు మధ్యలో 1gm మిరియాల చూర్ణం వుంచి ,ఆ పండు తింటూ వుంటే ఎంత కాలం నుండి వున్నా దగ్గులైన పోతాయి.
[2].అతిమధురం,దోరగా వేయించిన మిరియాలు,కచురాలు ఈ మూడింటిని సమబగాలుగా గ్రహించి దంచి చూర్ణం చేసుకుని ,రోజు అర లీటర్ మంచి నెల్లల్లో 15gm చూర్ణం కలిపి పావు లీటర్ కాషాయం మిగిలేల మరగబెట్టి వడగట్టి , చల్లార్చి పూటకు పావు లీటర్ మోతాదుగా పటికే బెల్లం పొడి కలుపుకొని తాగుతూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[3].అడ్డరసం ఆకుల కషాయము 640gm పంచదార 640gm తీసుకుని పాకము పట్టి అందులో 80gm పిప్పలి చూర్ణము 80gm పాత నెయ్యి కలిపి లేహ్య పాకముగా చేసుకుని పాత్ర దించి ,చల్లార్చిన తరువాత అందులో 640gm తేనె కలిపి నిలువ వుంచుకోవాలి.పూటకు 6gm లేహ్యం చొప్పున రెండు పూటల తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది


తల నొప్పి:

[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు వేస్తూ వుంటే తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి,జలుబు పోతాయి.
[2].నువ్వుల నూనె 72gm శొంటి 6 gm అతిమధురం 6gm ఈ మూడింటిని మెతగా చూర్ణం చేసి నువ్వుల నూనె లో వేసి బాగా వేగిన తరువాత దించి వదపోసుకుని నిలువ చేసుకోవాలి.ఒంటి తలనొప్పి వచ్చే సమయానికి తలకు ఈ నోనేతో మర్దన చేసిన ఎంత దారుణ మయిన తలనొప్పి అయిన పోవును.రెండు మూడు రోజుల కు ఒకసారి స్నానం చేయవలెను.స్నానం చేసిన తరువాత పగటి నిద్ర ,స్త్రీ సంపర్కం , చలువ చేయు పదార్దములు వాడరాదు.
[3].బెల్లము,శొంటి సమంగా కలిపి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గి పోతుంది.
[4].తినే ఉప్పు,పాటికే బెల్లం ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని,రెండు పూటల 2gm పొడిని గోరువెచని నేతిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గిపోతాయి


కడుపు నొప్పి:

[1].ఒక నెలలో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
[2].దాల్చిన చెక్క అరకు తెచుకుని , అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగితే కడుపు నొప్పి , అజీర్ణం ,దగ్గు , ఒగర్పు ,తగ్గుతాయి . ఇంకా ఈ అరకు ఉపయోగించడ వల్ల అతిసార విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
[3].వాము వాటర్ ఒకటి లేదా రెండు ఔన్సుల మోతాదుగా అవసరన్న్ని బట్టి తాగుతూ వుంటే కడుపు నొప్పి ఉబ్బరం తగ్గిపోతాయి


చర్మ రోగాలు:

[1].ఒళ్ళు దురద:
వాము 20 gm ,పసుపు 10gm, పోడించిన వెల్లి గారము 10gm .ఈ మూడు కలిపి మంచి నీటితో మెతగా నూరి దురద ఉన్న చోట మర్దన చేస్తూ వుంటే , 5 లేదా 6 రోజుల్లో ఎంత మొండి దురధలైన హరిన్చిపోతై . వంటికి లేపనం చేసిన తరువాత 2 గంటలు ఆగి స్నానం చేయాలి.వేడిచేసే పదార్ధాలు ,వంకాయ ,కోడి మాంసం , కోడి గుడ్డు పనికి రావు.
[2].తామర:
వాము 100gm , జిల్లేడు పాలు 200gm ,తీసుకుని రెంటిని కలిపి మెతగా నూరి ఉంచాలి.నువ్వుల నూనె 100gm, బాండి లో పోసి నూనె వేడెక్కిన తరువాత పైన తయారైన వాము జిల్లేడు పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెం పకోడీ వలె నూనె లో అవి నల్లగా మాడి పోయే వరకు వుంచి ,ఆ నూనె ను వడ పోసి నిలువ వుంచుకోవాలి.రోజు రెండు పూటల తామర వున్నా చోట ఈ తైలాన్ని మర్దన చేస్తూ వుంటే క్రమంగా తప్పకుండ తామర రోగం పోతుంది.
[3].శీతాఫలం ఆకు ,తుమ్మకు ,తులసి ఆకు ,వేపాకు ఇవి సమ బాగాలు తీసుకుని మెతగా రుబ్బి అందులో మేక పాలు , వంట కర్పూరం కలిపి మెత్తగా పేస్తే లాగా చేసుకుని వాడితే చర్మ రోగాలు అన్ని పోతాయి.
[4].చిత్ర మలం వేరు ,జిల్లేడు చెక్క ,తన్తేపు గింజలు వీటిని సమబగాలుగా గ్రహించి 3 రోజులు మజ్జిగలో నానబెట్టి ,మెతగా నూరి తామర మీద లేపనం చేస్తే ఎంత కల నుంచి వున్నా తామర అయిన తగ్గి పోతుంది.
[5].శరీరమంత దురదగా జిలగా వున్నా వారు వేప చిగుళ్ళు పసుపు కలిపి కొంచెం మంచి నీటితో మెత్తగా నూరి ఆ పేస్తే ను వంటికి పట్టించుకుని ఎండిన తరువాత స్నానం చేస్తూ వుంటే ,చర్మం ఫై దురదలు ,ధదుర్లు పోతాయి.
[6].దురదగా వున్నవారు కలబంద గుజ్జును నీటిలో కడిగి దానిలో పసుపు కలిపి నూరి లేపనం చేసి వాడితే దురదలు పోతాయి.
[4].స్కిన్ ఎలేర్గి ఉన్నవారు అల్లం ,ధనియాలు ,జీలకర్ర ,వాము ,తులసి ,నిమ్మరసం ,తేనె కలిపి సేవించిన కొన్ని పూతలలోనే స్కిన్ ఎలర్జీ పోతుంది.
[5].పాచి పొగాకు మొల మీద లేచిన గజ్జి పైన చుట్టి పైన బుట్ట కట్టుకుంటే మొల గజ్జి హరించి పోతుంది.
[6].పత్తి వేరును ,పతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.
[7].అతి మధురం చూర్ణం పూటకు 5gm మోతాదుగా పాలలో లేక తేనె తో కలుపు కొని 2 పూటల సేవిస్తూ వుంటే ఇంగ్లీష్ మందులు అతిగా వాడటం వాళ్ళ వచ్చిన ఎలేర్జి తో వచ్చే ధదుర్లు పోతాయి
.

కీళ్ళ నొప్పులు:

[1].బెల్లము ,శుది చేసిన గుగ్గిలం ,ఈ రెండు సమ బాగాలుగా కలిపి దంచి రేగి పండంత టాబ్లెట్ చేసికొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,చీల మండల నొప్పులు తగ్గి పోతాయి.
[2].వాము ,శుద గుగ్గిలం ,మల్కంగిని గింజలు ఈ మూడు సమంగా కలిపి మెతగా దంచి ,నీటితో నూరి సెనగ గిన్జలంత టాబ్లెట్ చేసి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకుని , పూటకు 3 టాబ్లెట్ చొప్పున మంచి నీటితో వేసుకుని అమపనగా 1 కప్పు వేడి పలు తాగాలి ఇలా రెండు పూటలు చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,కాళ్ళ నొప్పులు ,నరాల నొప్పులు మొదలైన వాత సమస్యలు పోతై .
[3].వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణము కలిపి కీళ్ళ మీద మర్దన చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
[4].పొగాకు చిగురాకులు ,ఆముదపు చెట్టు చిగురాకులు ,ఉమ్మెత చిగురాకులు ,జిల్లేడు చిగురాకులు ఈ 4 సమ బాగాలుగా తీసుకుని మెతగా నూరి శనగ గిన్జలంత మాత్రలు చేసి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి.ఈ టాబ్లెట్ ను 2 పూటల పూటకు 1 వేసుకుంటూ వుంటే కీళ్ళ వాతం తగ్గుతుంది.ఇది ప్రసిద్ధు లైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకుని వారి పర్యవేక్షణలో వాడుకోవాలి.
[5].పొగాకు 120gm తీసుకుని ముక్కల కింద నలగగొట్టి ఒక లీటర్ నీటిలో వేసి 1 రోజంతా నానబెట్టాలి .తరువాత ఆ పొగాకును బాగా పిసికి గుడ్డలో వడపోసి ఆ నీరు గ్రహించాలి .ఆ నీరు ఎంత ఉంటె అంత నువ్వుల నువ్వుల నూనె మిగిలేవరకు మరగబెట్టి దించి వడపోసి ,నిలువ ఉంచుకుని రోజు 2 పూటల ఈ తైలముతో నొప్పులున్న చోట మర్దన చేసుకుంటూ ఉంటె అతి త్వరగా కీళ్ళ నొప్పులు హరిన్సిపోతై.
[6].వాము వేదనతో కూడుకోనియున్న మునగాకును దంచి నూనెలో ఉడికించి కీళ్ళ పై వేసి కట్టాలి.
[7].లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ఆముదంతో గాని ,ఆవునేయ్యితో గాని ఉడికించి కీళ్ళ మీద వేసి కట్టు కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి


వాంతులు:

[1].తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రత బట్టి వాడుతూ వుంటే వ్యాధులు తగిపోతై .
[2].కరక్కాయ , శొంటి పిప్పలు , మిరియాలు , ధనియాలు ,జీలకర్ర వీటిని సమబగాలుగా తీసుకుని దోరగా వేయించి రోజు 2 లేక 3 పూటలు 3 gm పొడి ఒక స్పూన్ తేనె తో కలిపి సేవిస్తూ ఉంటె వాంతులు ఆగుతాయి.
[3].బెల్లము , జీలకర్ర సమంగా కలిపి దంచి ,ఉసిరికాయంత ఉండలు చేసుకుని రోజు 4 లేక 5 సార్లు తింటూ ఉంటె వంతులు ఆగుతాయి.


విరేచనాలు:

[1].బెల్లం , ఆవాలు సమ బాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ,బట్టాని గింజ లంత టాబ్లెట్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున మంచి నీళ్ళల్లో 3 పూటల వేసుకుంటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తప్పకుండ తగ్గుతాయి.
[2].వాము 10gm ,పొంగించిన ఇంగువ 3gm , తెల్ల కాచు 5gm ,వేప బంక 3gm, పాత బెల్లం 20 gm ,వీటన్నింటిని కలిపి పెరుగుతో మెతగా దంచి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి .మాత్రలు పూర్తిగా ఆరాలి .రోజు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటల మంచి నీటితో వేసుకుంటూ వుంటే , కడుపు నొప్పితో కూడిన విరేచనాలు 2 ,3 రోజుల్లో తగ్గిపోతాయి .ఆహారంలో ఉప్పు కారం పనికిరావు.
[3].రెండు ఔన్సుల వాము వాటర్ మంచి నీటిలో కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[4].ఆవాలు , బెల్లం కలిపి మెత్తగా నూరి 5gm , తబ్లేట్ట్స్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల వేసుకున్న నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[5].వేపాకులు కొంచెం నీళ్ళతో మెతగా నూరి రసం పిండి గుడ్డలో వడపోసి ,10gm రసములో 5gm,పటిక బెల్లం పొడి కలిపి 2 పూటలా తాగితే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
[6].అరటి పండును పటిక బెల్లంతో అద్దుకొని తింటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి


జ్వరం:

[1].బెల్లం 20gm ,తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని , వాము చూర్ణం గాని , కొంచెం దోరగా వేయించి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి.
[2].ఉప్పు ,మిరియ్లు , పిప్పింటకు[మూర్కొండకు] , ఈ మూడు సమంగా గ్రహించి కచపచగ నలగగొట్టి గుడ్డలో వేసి మూట గట్టి దాన్ని వాసన చూస్తూ వుంటే చలిజ్వరం రాకుండా వుంటుంది.
[3].వాము పొడి 6gm , పాత బెల్లం 20gm ,కలిపి పూటకొక మోతాదు చొప్పున దంచి 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి


చెవి:


[1].ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో కురసాని వాము తెచ్చుకుని నేలలతో మెత్తగా నూరి గుడ్డలో వడ పోసి , ఆ రసంలో కొంచెం తేనె కలిపి ఆ రసాన్ని చీము కారుతున్న చెవిలో నాలుగు చుక్కలు వేస్తూ ఉంటె అతి త్వరగా చీము కారడం తగ్గి పోతుంది .
[2].వాము 2 చిటికెలు ,తమలపాకులు 2 ,కలిపి దంచి రసం తీసే వడ పోసి నాలుగు చుక్కలు 2 పూటల వేస్తూ ఉంటె చెవి పోటు తగ్గి పోతుంది.
[3].వాము 50gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటిలో కలిపి మెతగా రసం వచేలా నూరి ,ఆ రసంలో నువ్వుల నూనె 100gm కలిపి మట్టి పాత్రలో పోసి చిన్న మంట మీద నీరు ఇరిగి పోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఆ నూనేనిలువ ఉంచుకుని రోజు 2 పూటలు పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గిపోతుంది.
[4].వేపాకును కొంచెం నలగగొట్టి నీటిలో వేసి బాగా మరిగించి దించి, దానిని ఆవిరిని చెవులకు పట్టిస్తూ ఉంటె చెవి నొప్పి వెంటనే తగ్గి పోతుంది.
[5].పొగాకును నీటితో తడిపి రసం తీసి వెచ చేసి వడపోసి చెవుల్లో 3 ,4 చుక్కలు వేస్తూ ఉంటె చెవి వ్యాధులన్ని పోతాయి.
[6].వాకుడు వేరు ,ఆవాలు సమంగా కలిపి చూర్నంచేసి ఆ చూర్ణాన్ని నిప్పుల మీద వేసి ఆ పొగను చెవులకు పట్టిస్తే , ఆ పొగ తగలగానే చేవులోని క్రిములు జల జల కింద పడి పోతాయి .
[7].ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ చేసి దంచి రసం తీసి ,దానితో సమానంగా అల్లం రసం ,నువ్వుల నూనె , అతి మధురం ,ఉప్పు ,కలిపి తైలం మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి వడపోసి ,ఆ నూనె ను చెవిలో 5చుక్కలు వేస్తె వెంటనే చెవి పోతూ తగ్గి పోతుంది.


అల్సర్:


[1].పాత బెల్లం , అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరి కాయంత ముద కొద్ది కొద్దిగ తింటూ వుంటే అల్సర్ తగ్గుతుంది.
[2].అల్లం , బెల్లం , నువ్వులు సమపాళ్ళల్లో కలిపి వాడినా అల్సర్ తగ్గుతుంది.


కన్నులు:

[1].కలబంద లో పాతిక కలిపి కళ్ళల్లో పోసిన కంటి దెబ్బలు పోవును. [2].స్పోటకము వచ్చిన అరికాళ్ళకు గోరింటాకు పెట్టిన కళ్ళకు ప్రమాదకరమైన జబ్బులు చేయవు.
[3].పేద కానుగ కాయలను నల్ల ధారమునకు గుచ్హి చిన్న పిల్లల మేడలో కట్టిన కంటి జబ్బులు నివారించును.
[4].కంటి లోని మురికి తోలిగించుటకు చింత గింజను తేనె తో గంధము తీసి పచ కర్పూరము చేర్చి కన్ను యన్దున్చావలెను.
[5].2 మాసముల ఎత్తు పటక పొడి కలిపినా నీటిని కండ్లలో వేసినచో కండ్లలోని మురికి తొలిగి కంటి గాయములు మానును.

కండ్ల కలకల నివారణకు:

[1].రోజుకు ఒక నువ్వు పోగు చొప్పున పువ్వులను వారం రోజు లు సేవించిన కండ్ల కలకలు రావు .కండ్ల కలకలు వచ్చిన తరువాత సేవించిన నిరోధముగావించును.
[2].నంది వర్ధనము పువ్వుల రసమును కళ్ళల్లో వేసిన కళ్ళ కలకల నివారణమగును.
[3].బాగుగ కాగిన నీటిలో రెండు గురి గింజ ల ఏతు లో నల్ల మందు ను వేసి ఆవిరిని కళ్ళకు పట్టించిన కళ్ళ కలకల హరించును.
[4].నందివర్ధనము ఆకు పసరును పోయవలెను.
[5].నీరుల్లిపాయ ను నూరి రసమును తీసి పోయవలెను.
[6].కనుగోటి వితులను పొడి చేసి వేడి నీటిలో అరగ తీసి కంటిలో వేయవలెను.
[7].కంటి కలకల ప్రారంబ దశలో నువ్వుల నూనె ను కంటి లో 1,2 చుక్కలను వేయవలెను .
[8].గోరువెచని పసుపు కషాయంలో పలుచటి నూలుగుడ్డ ముంచి కొద్దిగా పిండి ఆ గుడ్డను కళ్ళ పై వేస్తూ ఉంటె కళ్ళ కలకల తగ్గి పోతాయి .
[9].కలబంద మట్టలలోని గుజ్జు ను నీటితో కడిగి తెల్లని గుడ్డలో వేసి కొంచెము పాచి పాతిక పొడిని ,నల్లమంధులను చేర్చి పొట్లము కట్టి కళ్ళకు అద్దుకొనవలెను.
[10].ఉక్కు రసము ,నిమ్మకాయ బద్ధ పై వేసి తెల్ల బట్టతో మూటను కట్టి కళ్ళకు అదుముకునుచున్దవలెను


అజీర్ణం:


[1].వాము ,మిరియాలు ,ఉప్పు , సమపాళ్ళల్లో , కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున 3 వేళ్ళకు వచ్చునంత సేవిన్చకాలేను.
[2].2 చింత గింజలను పెనం పై వేసి కాల్చి ఫై పొట్టు గీకి వేసి నోటిలో వేసుకుని నమిలి మింగిన అజీర్ణం పోవును.
[3].40gm ల నిమ్మరసం లో జీలకర్ర 3gm, సైంధవ లవణము 3gm, అల్లపు ముక్కలు 10 gm వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.
[4].దాల్చిన చెక్క , యాలకులు వేయించిన మిరియాలు సమపాళ్ళల్లో కలిపి పొడి చేసి పూటకు 3 gm చొప్పున బెల్లం తో కలిపి పుచుకోన వలెను.
[5].నీరుల్లిపయను ముక్కలుగా కోసి బోజన సమయంలో తినవలెను.
[6].నేతితో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణం అగును.
[7].నిమ్మరసంలో తినే సోడా ను 5gm లు కలిపి ఒక ఔన్సు తాగవలెను.
[8].పంచదార లేక బెల్లపు పానకమును తీసుకొనవలెను.
[9].రాత్రి రాగి పాత్రా లో ఉంచిన నీటిని ఉదయం పరిగడపున తాగవలెను.
[10].రోజు బోజనానికి ముందు 2 చిటికెలు దాల్చిన చెక్క పొడి ,2 చిటికెలు శొంటి పొడి , 4 చిటికెల యాలక గింజ ల పొడి కంచెం మంచి నీళ్ళల్లో కలిపి తాగుతూ వుంటే అజీర్ణ ,అసనం లోని తెపులు తగ్గిపోతాయి .
[11].మునగాకు రసం కొంచెం లవణం కలిపి పిల్లలకు తాగిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది.
[12].వాకుడు వేరు , అడ్డ రసం వేరు , తిప తీగ ఒక్కొక్కటి 40 gm ల చొప్పున తీసుకుని 600gm నీటిలో వేసి 75gm కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లార్చి తాగితే అజీర్ణం పులి తేనుపులు పోతాయి.
[13].ఉదయం పూట అల్లం ముక్కను నీళ్ళు కలిపి దంచి రసం తీసి నిలువ ఉంచితే పైన మంచి రసం తేరుకుంటుంది దానిని 2 స్పూన్ ల మోతాదుగా తీసుకుని దానిలో 1 స్పూన్ సైంధవ లవణం కలిపి రోజు తినాలి
.

అరుచి:

[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.
[2].ఆవాలను నూరి నాబిపైన ప్రతిరాత్రి పట్టు వేయవలెను.
[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.
[4].కరక్కాయ కాల్చిన బెరడును నోట బెట్టుకుని రాత్రి పరున్దవలెను.
[5].బోజనమున మొదటి ముద్హలో కాల్చిన శొంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను .


బొల్లి:

[1].వెమ్పాలి చెట్టు బెరడును మెతగా నూరి వస్త్ర గాలితం పట్టి రోజులు 2 తులముల చొప్పున 15 రోజులు తినిపించి రోగికి గాలి తగలకుండా కూర్చున్దబెత్తవలెను.ఉప్పు లేని శనగ రొట్టె ఆహారంగా ఇవ్వవలెను.
[2].తుంగ ముస్థలు, దాల్చిన చెక్క , కబబు చిన్ని కషాయమును కాచి 40 రోజు లు పుచుకోనవలెను.
[3].వెలగ ,ఉసిరిక , వేప , చింత ఆకులు మరియు జీలకర్ర , వెల్లుల్లి , మిరప కాయలు , ఉప్పు , సైంధవ లవణము లను చూర్ణము చేసి కొత్త కుండ ఉంచి పూటకు 6gm , చొప్పున 60gm నెయ్యి చేర్చి అన్నముతో 40 రోజు లు సేవించవలెను.
[4].ఈశ్వర వేరు చెక్క రసమును రోజు కు 3gm పుచుకోనవలెను.
[5].ఇప్పపువ్వు 3 వేళ్ళకు వచ్హినంత తీసుకుని ఉదయం , సాయంత్రం చక్కగా నమలి తినవలెను.
[6].మినుములు నూరి రాసిన శ్వేతా కుష్టు నివారనమగును.
[7].మొదట శరీరమునకు నూనె రాసి పిమ్మట రేలా ఆకులు,కామంచి ఆకులు మజ్జిగతో నూరి నలుగు పెట్టుచున్దవలెను.
[8].వేపకాయలు , ఆకులు , పువ్వులు బాగా నూరి అర తులము పూటకు పుచుకోనుచు 4 రోజు లు సేవించవలెను.
[9].నల్ల త్రాచు కుబుసమును మసి చేసి దానితో తాడికాయ పొడి నూనె లో కలిపి పూయవలెను.
[10].రోగి పురుషుడైన స్త్రీ రురక్తమును శ్వేతా కుష్టు మచల ఫై పూయవలెను.
[11].రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచల ఫై పూయవలెను ఇట్లు చేసిన మచ లు శాశ్వతముగా పోవును.
[12].మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్హి ౩ రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్హి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.


Saturday, January 24, 2009

సోమరితనం

సోమరితనము:


ఇది మనిషిని అనేక రకాలుగా నాశనం చేస్తుంది.చదువు పాడవుతుంది.
సంస్కృతి చెడిపోతుంది.
సోమరితనం వున్న వారు ఎందుకు కొరగాని బ్రతుకును అనుబవిన్చవలిసి వస్తుంది.
ఇలాంటి వారి ఇంట్లో తల్లి దండ్రులు , బార్యా పిల్లలు , సంగములో స్నేహితులు అసహ్యించుకుంటారు.పేదలు సంపాదించిన ఆస్తి నిలుపుకోలేక కొత్త సంపాదన గడించలేక దారిద్రాన్ని అనుబవిన్చవలసి వస్తుంది.

ఉదాహరణకు ఉదయం 4 1/2 గంటలకు లేచిన మనిషి , వ్యాయామం , స్నానం , ధ్యానం , పూజ 6 గంటలకు ముగిసి పోయి నిత్య జీవిత కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అన్ని పనులు సక్రమముగా నెరవేరుతాయి.
సోమరితనం వల్ల ఉదయం 7,8 గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ తాగి పండ్ల బ్రష్ సుమారు అరగంట వేసి , స్నానం పూజ అయ్యేసరికి 10 అవుతుంది.1 గంట భోజనం 11 గంటలు అవుతుంది.
బుక్తాయాసం కొరకు ప్రక్క వాలిస్తే తిరిగి లేచే సరికి 3,4 గంటలు అవుతుంది.తిరిగి టిఫిన్ టీ మొదలుగునవి.మరి పనుల సంగతి దేవుడెరుగు.
.ఎవరేమన్నా కోపము కొట్లాటలే మిగిలేవి.యువతీ యువకులు ఇలాంటి వారున్న కుటుంబాలు చాలా వున్నాయి . తనను తానేరుగని సోమరులకు మంచి ఆలోచనలు ఎలా వస్తాయి.

సోమరితనాన్ని తొలగించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రములో చెప్పబడిన యోగాసనాలు ,సూర్య నమస్కారాలు తప్ప ఏ వైద్య శాస్త్రములోను మందులు వుండవు.

ధూమపానం అనర్ధాలు

మానవుని మనుగడకు అతిముక్యమైనది గాలి.గాలిలో మన రక్తాన్ని శుబ్రపరిచే ప్రాణవాయువు 1/4 వంతు వుంటుంది.ఇది మన ప్రతి శ్వాసలో , ఊపిరితితులలో నిండి రక్తాన్ని శుబ్రపరుస్తుంది.
శుబ్రమైన రక్తంలో వుండే ప్రాణ వాయు శక్తి అన్ని జీవ కణాలకు చేరుతుంది.శుద రక్తం శేరీరంలోని అన్ని బాగాలకు ప్రసరిస్తున్నప్పుడు శరీర కర్మల ద్వారా జరిగిన క్రియ వల్ల ఏర్పడిన మలినాలు కొన్ని రక్తంలో కలియడం వల్ల రక్తం చేదుగా మారుతుంది.
చెడు రక్తం లో కార్బన్ బాగం ఎక్కువ ఉన్నందున చిక్కగా , నల్లగా ఏర్పడుతుంది . అది శరీరం అన్ని బాగాల నుండి తిరిగి ఊపిరితితుల లోనికి క్రమంగా ప్రవహిస్తూవుంటుంది.
మానవుడు ఒక దినములో 21600 శ్వాసలు జరుపుతాడు.ప్రతి శ్వాసలో గాలి రక్తం తో స్పర్శ జరిపినపుడు గాలి లోని ప్రాణవాయువు రక్తం లోకి రక్తం లోని చెడు పదార్ధాలు గాలిలోకి చేరుతాయి నిష్వాసలో చెడుగాలి బయటకు పోతుంది.

[1].ధూమపానం వల్ల పొగ ఊపిరి తిథులలో చేరుతుంది.ప్రానవాయు స్థానములో ధూమము చేరుత వల్ల , రక్తానికి ప్రాణవాయువు చేరకుండా శరీరంలోనికి చేరుతుంది.అది తిరిగి ఊపిరితితులలోనికి చేరడానికి కొంత కాలం పడుతుంది.అది తిరిగి వచినపుడు మళ్ళీ చుట్టతాగడం మొదలు పెట్టరనుకోండి దాని గతి అధోగతి అవుతుంది.

[2].వంటశాలలోని గోడలు చూడండి అట్లే చుట్ట తాగే వారి ఊపిరితితుల లోని లోపల పొరలు నల్లగా పోగావారి వుంటాయి . అందువల్ల వాటిలో చిన్న చిన్న రంధ్రాలు పడి T.B(క్షయ), ఆస్తమా , దగ్గు , దమ్ము , కాన్సర్ వంటి బయంకర రోగాలు వస్తాయి.

[3].నోరు పోగావాసనతో నిండి పోయి ఏ పదార్ధాల రుచి వాసనలు గుర్తించలేరు .నోరు చెడి నోటి కాన్సర్ , పండ్లకు సంబంధిచిన రోగాలు వస్తాయి .

[4].ఏ ప్రయోజనం లేని సిగరెట్లకు డబ్బు వృధా చేస్తారు .సమయానికి డబ్బు లేకున్నా అప్పు చేసినా సిగరెట్ కొంటారు. ఒక సమయంలో అన్ని విడిచి అడుక్కునైనా సిగరెట్ కొంటారు.

[5].సిగరెట్ లో వున్న "నికోటిన్ " అనే విష పదార్ధము వల్ల మెదడు చెడి , నిద్ర లేమి అన్యయాతత ,గాబరా ఆందోళన మానసిక సంబంధమైన రోగాలు వస్తాయి .

[6].కార్బోన్ తో కూడిన రక్తం చిక్కగా నల్లగా ఉన్నందున రక్త కేశనాలికలో దూరక B.P. పెరుగుతుంది . మెదడులోని రక్త నాలములో ఒక్కోసారి గడ్డ కట్టుకుపోతాయి.

[7].కొందరు పొగను కడుపు లోనికి మ్రింగి కొంత సేపు వుంచి మెల్లగా బయటకు వదులుతూ వుంటారు.అట్టి వారికి కడుపు నొప్పులు గాస్త్రిక్ అల్సర్లు వస్తాయి.

ఏ ఉపయోగంలేని ధూమపానం అలవాటు చేసుకోకూడదు .అలవాటు వున్నవారు గట్టి మనో నిర్ణయం చేసుకుని మాని వేయాలి.ధూమపాన దోషాలను
(1)శ్వాసక్రియ వ్యాయామము , ద్వారా తొలగించుకోవాలి
(2) తులసి - గులాబి - మొగలి రేకులను ఎండించి అతి మెత్తని పొడి చేసి వాసన చూచుట ద్వారా
(3) కడుపు లోని కి స్వచమైన వెన్న తినుట ద్వారా తొలగిచుకోవాలి.మల్లి ఎప్పుడు సిగరెట్ మొదలు పెట్ట కూడదు.

వాము(ఓమ) తో ఆయుర్వేదం

అవయవాలు షాక్ కొట్టినట్లు అదురుతూ వుంటే
వాము ,మిరియాలు , గసగసాలు ఈ మూడు సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి వస్త్ర గాలితం చేసి , ఆ పొడికి తగినంత నువ్వుల నూనె కలిపి మెత్తి పేస్టు లాగా రుబ్బి , ఆ పేస్టు ను వళ్ళంతా రుద్దుకుంటే అవయవాలు అదిరే రోగము తగ్గుతుంది.
వళ్ళంతా తిమ్మిర్లా?
వాము 100gm , తీసుకుని నీటితో మెత్తగా నూరి అందులో 50 gm , ఆవు నెయ్యి కలిపి చిన్న మంట మీద నెయ్యి మాడి పోకుండా వండి దించి దానిని గోరువేచగా తిమ్మిర్ల మీద వళ్ళంతా మర్దనా చేసుకుంటూ , అదే నేతి ని పూటకు ఉసిరికాయంత తింటూ వుంటే తిమ్మిరి తగ్గి పోతుంది .
ముక్కు సమస్య
వాము 10gm , పాత బెల్లం 40 gm , తీసుకుని 2 కలిపి దంచి ఆ ముద్దను అర లిటరే నీటిలో వేసి , పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి దించి , వడపోసి ఉదయం పూట తాగాలి , అలాగే సాయంత్రం కూడా తాగాలి.ఇలా 2 లేక 3 రోజులు తాగేటప్పటికి జలుబు , పడిశము , శ్వాససరిగా లేక పోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబంధించిన సమస్యలు తీరతమే కాక ఉదరం లోని గ్యాస్ తోలిగిమ్పబడి , అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి , తిన్న ఆహారం బాగా వంటబట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.
చెవుడు
వాము 50 gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటితో కలిపి దంచి రసం తీసి , ఆరసం లో నువ్వుల నూనె 100gm , కలిపి చిన్న మంట మీద నీరు ఇగిరి పోయి , నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి , ఆ నూనె నిలువ ఉంచుకుని , రోజు 2 పూటల పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గుతుంది.
చెవిలో పోటు
వాము 2 చిటికెలు , తమలపాకులు 2 కలిపి దంచి రసం తీసి వడపోసి 4 చుక్కలు 2 పూటలా చెవిలో వేస్తూ వుంటే చెవుడు తగ్గుతుంది.
కళ్ళు దురదలు
వాము చెట్టును సమోలంగా తేచి కడిగి ఎండ బెట్టి కాల్చి బూడిద చేయాలి . ఆ బూడిదను నీటిలో కలిపి 3 రోజులు నిలువ ఉంచాలి . తరువాత పాత్రలో తేరుకున్న తేటను వంచుకుని వడపోసి నిలువ వుంచుకోవాలి. దీనిని కళ్ళు దురధలుగా వున్నప్పుడు 2 చుక్కలు కంట్లో వేసుకుంటే దురదలు తగిపోతై.
కనురెప్పల వెంట్రుకలు ఊడుట
వాము 3gm తీసుకుని ఇసుక లేకుండా శుబ్రంగా చెరిగి రోటిలో వేసి అందులో నాటు కోడి గుడ్డు లోని తెల్ల సోన వేసి బాగా మెతగా కాటుగా లాగా మర్దించి నిలువ ఉంచుకుని , కంటి రెప్పలకు పెడుతూ వుంటే క్రమంగా రెప్పల మీద వెంట్రుకలు ఊడటం తగ్గటమే కాక , రెప్పల వాపు , రెప్పల లోపల పెరిగే దుర్మమ్సం కూడా హరించి రెప్పల మీద ఊడిపోయిన వెంట్రుకలు మల్లి మోలుస్తై.
ఒళ్ళు దురద
వాము 20gm , పసుపు 10gm , పొంగించిన వెలిగారము 10gm ఈ 3 కలిపి మంచి నీటితో మెత్తగా దంచి దురధలున్న చోట మర్దన చేస్తూ వుంటే అయిదారు రోజుల్లో ఎంత మొండి బండ దురధలైన హరించి పోతై. వంటికి లేపనం చేసిన చేసిన తరువాత 2 గంటలు ఆగి వేడి నీటితో స్నానం చేయాలి. వేడి చేసే పదార్ధాలు , వంకాయ , గోంగూర , గుమ్మడి కాయ , గోంగూర ,ఆవకాయ , కోడి మాంసం కోడి గుడ్డు పనికి రావు.
చెవిలో చీము
వాము 10gm , పసుపు 10gm , ముల్లంగి దుంపల రసము 75gm , నువ్వుల నూనె 250gm .తీసుకుని వీటిని ఇనుప మూకుడు లేదా ఇనుప బాండి లో వేసి చిన్న మంట మీద నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి , నిలువ వుంచుకోవాలి .రోజు 2 పూటలా 2 లేక 3 చుక్కలు చెవుల్లో వేస్తూ వుంటే ఏ కారణం వల్ల కలిగిన చెవిలో చీము అయినా తగ్గిపోయి చెవులు ఆరోగ్యవంతంగా మారతాయి.
కాళ్ళల్లో - చేతుల్లో చెమటా ?
వామును శుబ్రం చేసి ,కొంచెం దోరగా వేయించి దంచి ఆ పొడిని తగినంత మంచి నువ్వుల నూనె లో వేసి నానబెట్టి రోజు పరగడపున 5gm మోతాదుగా తింటూ వుంటే అరచేతుల్లోనూ ,అరికల్లోను వచ్చే చెమట తగ్గిపోతుంది.

వాము(ఓమ) తో ఆయుర్వేదం

చర్మంపై దద్దుర్లు
వాము ,పాత బెల్లం సమబాగాలుగా దంచి ఉసిరిక కాయంత(10gm) ఉండలుగా చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక ముద్ద చొప్పున 2 పూటలా తింటూ వుంటే చర్మం పై దద్దుర్లు తగ్గి పోతాయి.
నీళ్ళ విరేచనములు
వాము అరకు అంటే వాము వాటర్ పూటకు ఒక ఔన్సు చొప్పున 2 లేక 3 పూటలా సేవిస్తూ వుంటే వెంటనే నీళ్ళ విరేచనాలు కట్టుకున్తై.విరేచనాలు ఎక్కువగా వుంటే 2 ఔన్సులు పేద వాళ్లకు ఇవ్వవచ్చు.
కడుపు నొప్పులకు
వాము వాటర్ ఒకటి లేదా 2 ఔన్సులు మోతాదుగా అవసరాన్ని బట్టి తాగితే వెంటనే కడుపు నొప్పి ,ఉబ్బరం తగ్గిపోతాయి.
కడుపులో మేలితిప్పుతూ ఉంటె
వాము , ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నీటిలో కలిపి మేతగా నూరి కుంకుడు గింజలంత టాబ్లెట్ చేసి గాలి తగిలేటట్లు ఆరబెట్టుకుని ,పూటకు ఒక టాబ్లెట్ చొప్పున వేడి నీటితో వేసుకుంటూ వుంటే అజీర్ణం ,గ్యాస్ అసిడిటీ వల్ల ,కడుపులో మెలితిప్పినట్లుగా వుండే ఉదర శూల తగ్గి పోతుంది.
ఆకలి పెరుగుటకు
వాము 10gm ,నల్ల ఉప్పు 3gm , పొంగించిన ఇంగువ 1gm కలిపి దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.ఆకలి సరిగా లేనప్పుడు ఈ చూర్ణాన్ని 2 చిటికెల మోతాదుగా గోరువేచని 2 పూటలా సేవిస్తూ వుంటే కడుపు వికారము , కడుపు శూల ,అజీర్ణము ఇవన్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.
జలుబు-పడిశము
వాము 10gm ,బెల్లము 40 gm కలిపి దంచి ఆ ముద్దను అర లీటర్ నీటిలో కలిపి పొయ్యి మీద పెట్టి పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి వాడపోసుకుని అది గోరువెచగా అయిన తరువాత తాగాలి.వేడి శరీరం వున్నా వారు ఈ కషాయం చల్లార్చిన తరువాత చల్లగా తాగాలి .తాగిన వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోవాలి .ఈ విధంగా 2,3 రోజు లు చేస్తే ఎంత తీవ్రమైన జలుబు ,పడిశ బారమైన తగ్గిపోతాయి.
కఫా జ్వరములకు
శరీరంలో కఫము పెరిగి జలుబు , జలుబు పడిశము తో కూడిన కఫా జ్వరము కలిగినపుడు వాము 10gm తీసుకుని చిన్న మట్టి పిడతలో వేసి అందులో 2 గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి రాత్రి నుండి ఉదయం వరకు అలాగే వుంచి ఉదయం పూట వడగట్టి అందులో చిటికెడు ఉప్పు కలిపి ఆ నీటిని తాగాలి . ఇలా 2,3 రోజులు చేస్తే కఫాజ్వరము తగ్గుతుంది.
విషమ జ్వరాలకు
వాము పొడి 6gm , పాత బెల్లం 20gm , కలిపి పూటకొక మోతాదుగా దంచి 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి .
డస్ట్ ఎలర్జీ
వాము మెత్తగా దంచి పలుచని గుడ్డలో మూట గట్టి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని మాటిమాటికి వాసన చూస్తూ వుంటే దుమ్ము వల్ల ,తాలింపు వల్ల ,గాటు వాసన వల్ల కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది.
పిల్లల సకల వ్యాధులు
వాము ,మిరియాలు ,శొంటి ,కుక్క పొగాకు ఈ 4 ఒక్కొక్కటి 10gm ,నల్ల ఉప్పు 20gm తీసుకోవాలి .వాము మిరియాలు ,శొంటి ఈ మూటిని దోరగా వేయించి అన్ని కలిపి దంచి పెట్టుకోవాలి .ఆ పొడిలో తగినంత కుక్క పొగాకు ఆకు రసము కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.తరువాత సైంధవ లవణం 3 చిటికెలు , వాము 3 చిటికెలు ఒక గ్లాస్ నీటిలో వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేల మరిగించి వడపోసి చల్లార్చి ఈ కషాయాన్ని 2 బాగాలు చేసి , పై మాత్రను సగం కషాయం తో ఉదయం ,సగం కషాయం తో సాయంత్రం వేసుకుంటూ వుంటే శిశువుల సమస్య తగ్గి పోతుంది.
మలేరియా జ్వరమునకు
వాము 5gm ,మిరియాలు లెక్కకు 12 ,శొంటి 5 gm.ఈ మూడింటిని ఒక మట్టి పిడతలో వేసి అందులో ఒక గ్లాస్ మంచి నీటిని పోసి రాత్రి నుండి ఉదయం వరకు వరకు నిలవ వుంచి ఉదయం పూట గుడ్డ లో వడపోసి ఆ నీళ్ళు పారబోసి ,పిడత లోని పదార్ధాలను తీసుకుని , అందులో 12 తులసి ఆకులు , 3 చిటికెల నల్ల ఉప్పు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండి పోయేలా ఆరబెట్టి నిలవ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూతల మంచి నీటితో వేసుకుంటూ వుంటే మలేరియా జ్వరం హరించి పోతుంది.

తులసి వైద్యం

[1].నోటి దుర్వాసన పోవటానికి తులసి ఆకులు ,మిరియాలు కలిపి రోజు నిత్యము నమిలి మింగాలి.

[2].నిత్యము 5,6 తులసి ఆకులు నమిలి మింగు చుండిన రక్తపు పోటు శాంతిస్తుంది.

[3].చెవి పోటు నందు 2,3 చుక్కలు తులసి ఆకు రసము వేయాలి .

[4].మలేరియా మరియు ఇతర జ్వరాలతో తులసి యాకు రసం 1 స్పూన్ ఉదయం సాయంత్రం సేవించాలి.

[5].తులసి కాషాయ సేవనంతో జలుబు ,రొంప ,శిరశూల ,జ్వరాలు తగ్గి పోతాయి.

[6].తులసి ఆకు రసం లో తేనె కలిపి సేవించిన తల తిరగటం ,బరమ ,పిత్త వికారాలు తొలగుతాయి .

[7].తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కాటు ,తేనె తీగలు ఇతర క్రిములు కరచిన చోట లేపనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.

[8].తులసి యాకులు ,తాగే నీటిలో లేదా తేనీటిలో రోజు వేసుకుని సేవించిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

[9].పసి పిల్లలకు వచ్చు కడుపుబ్బరం లో తులసి రసం ,తమలపాకు రసం సమానం తీసుకుని 10 చుక్కల చొప్పున రోజుకు 3,4 సార్లు పట్టాలి.

[10].పెద్ధలకేర్పాడు ఉదర వ్యాదులలో (కడుపు ఉబ్బరం) తులసి రసం అల్లపు రసం సమానం తీసుకుని 1 స్పూన్ మోతాదు ప్రతి 2 గంటలకు ఒకసారి సేవించాలి.

[11].శరీరము పై ఏర్పడు నల్లని మచ్చలకు తులసి ఆకు రసం పొంగించిన వేలిగారం తో కలిపి ముకానికి లేపనం చేయాలి.

[12].తల పై వచ్చు చుండ్రు కు ,తులసి యాకు రసాన్ని రుద్ది ఆ తరువాత వేప నూనె మసాజ్ చేస్తే తగ్గిపోతుంది.

[13].శరీరము పై ఏర్పడు దురద ,చర్మ వ్యాధులకు తులసి రసాన్ని పై లేపనానికి 1 స్పూన్ రోజు కు 2 సార్లు లోపలికి సేవించాలి.

[14].కాన్సర్ వ్యాధి రోగికి కూడా తులసి యాకులు ప్రతి నిత్యం రోజు తినిపిస్తే ఉపశమనం కలగటమే కాక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

[15].తులసి గింజల కషాయాన్ని అర్శమొలల వ్యాధి కల వారికి నిత్యం తాగించాలి.

[16].తల పై పేలు గల వారికి ,రాత్రి పడుకునే ముందు తులసి యాకు రసం తలపై అంటించాలి.

[17].తులసి యాకులు ,వేరు ఎండించి చూర్ణము చేసి ముక్కు పొడిగా ఉపయోగించిన ముక్కు సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.

[18].శరీరము పై ఏర్పడు దద్దుర్ల తో (ఎలర్జీ) తులసి రసాన్ని అంటించిన ఉపశమనం కలుగుతుంది.

[19].అన్ని రకములైన చర్మ వ్యాదులలో తులసి రసము ,నిమ్మ రసము సమానం కలిపి చర్మము పై లేపనం చేయవలె

తేనె తో ఆయుర్వేదం

స్త్రీల ఎర్రబట్టకు
తేనె 20gm ,ఉసిరికాయ బెరడు చూర్ణము 10gm .ఈ రెండు కలిపి ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే స్త్రీల ఎర్రబట్ట వ్యాధి ఎగిరిపోతుంది.
నేత్ర బలం
రాత్రి నిద్ర పోయే ముందు తేనె నీరుల్లి (ఒనిఒన్) రసం సమంగా కలిపి 2 చుక్కలు కంట్లో వేసుకొంటూ వుంటే నేత్ర దోషాలు నివారిమ్పబడి కండ్లకు అదిక బలము , దృష్టి పెరుగుతాయి.
అంటు వ్యాధులకు
తేనె మైనమును నిప్పుల మీద వేసి ఆ పొగను ఇంట్లో ప్రసరింపచేస్తూ వుంటే అంటూ వ్యాధులు సోకకుండా నివారిమ్పబదతై.అందుకే ప్రతి రోజు చేసే యజ్ఞం లో తేనె వాడాలని మన శాస్త్రాలు నిర్దారించై .
జలుబు-పడిశము
రోజు 2 లేక 3 పూటలా అవసరాన్ని బట్టి 30gm తేనె 25gm అల్లం రసం కలిపి తాగుతూ వుంటే జలుబు ,పడిశము 2 రోజుల్లోనే హరించి పోతాయి.జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం కూడా నివారింపబడుతుంది .
శరీర స్థౌల్యము తగ్గుటకు
ప్రతి రోజు ఉదయం పరగడపున 20gm తేనె ను రాత్రినిలువ వున్నా నీటిలో కలిపి తాగుతూ వుంటే క్రమంగా శేరీర స్థౌల్యము తగ్గిపోతుంది.
బిళ్లలకు-గడ్దలకు
తేనె ,సున్నము ఈ రెండు సమంగా కలిపి నూరి శరీరం మీద లేచే బిళ్లలకు గాని ,గడ్దలకు గాని పట్టు లాగ వేసి పైన పలుచటి నూలుగుడ్డ అంటిస్తూ వుంటే అవి కరిగిపోతాయి.
వంతులకు
తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.
కంటి మసకలకు
[1].ఎండు కర్జూరము కాయ లోపలి గింజను మంచి తేనె తో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని పెసర బాధంత కంట్లో పెట్టుకొంటూ వుంటే కంటి మసకలు నివారింపబడతాయి .
[2].మంచి మేలు రకమైన పట్టు తేనె 4 చెంచాలు ,మంచి మేలు రకమైన పచ్చ కర్పూరము 2 చిన్న పలుకులు కలిపి మేతగా నూరి గాజు బరిణి లో నిలువ ఉంచుకుని ,రాత్రి పూట కండ్ల లో పెసర బద్ధంత పెట్టుకొంటూ వుంటే ,కండ్ల లో కొంచెం నీరు కారి పోయి ,కండ్లు తేటగా చల్లగా మారి ,మసకలు కంటి దురదలు కూడా తగ్గిపోతాయి.
కాళ్ళ పగుళ్ళకు
తేనె మైనం 50gm ,తీసుకుని చిన్న మంట మీద మరిగించి వడపోసి అందులో 100gm వెన్నపూస కలిపితే అది కూడా కరిగిపోయి ,ఆ తరువాత ఆ రెండు దార్ధాలు పేస్ట్ లాగ మారతాయి. ఆ పదార్ధాన్ని పాదాల పగుళ్ళకు లేపనం చేస్తూ వుంటే పగుళ్ళు తగ్గిపోయి పాదాలు నున్నగా అవుతాయి.
కంట్లో పువ్వులకు
తేనె ,లేత మునగాకు రసం సమబాగంగా కలిపి రోజు రాత్రి నిద్ర పోయే ముందు 2 చుక్కలు కంట్లో వేస్తూ వుంటే కంటి లోని పువ్వులు కరిగి పోతాయి.
నీరసం రోగం
రోజు 2 పూతల అర గ్లాస్ మంచి నీళ్ళల్లో 30gm ,తేనె కలిపి తాగుతూ వుంటే నీరసం రోగం తగ్గిపోయి వంటికి మంచి బలం.
మూత్రం కష్టంగా వస్తుంటే
తేనె 150gm ,మంచి మేలు జాతి పసుపు 50gm ,కలిపి బాగా మెత్తగా నూరి నిలువ ఉంచుకుని రోజు 2 పూతల పూటకు 15gm ,మోతాదుగా సేవించి వెంటనే ఆవు పాలు తాగుతూ వుంటే మూత్రం బొట్టుబొట్టులా పడటం హరించి సాఫీగా వెలువడుతుంది.
దగ్గులకు
తేనె 3gm ,అల్లం రసం 6gm కలిపి ఒక మోతాదుగా ,2 పూటలా సేవిస్తూ వుంటే దగ్గు తగ్గిపోతుంది.
పిల్లల ఉదర పోటుకు
ప్రతి రోజు ఉదయం పరగడపున పావు గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా తేనె కలిపి తాగిస్తూ వుంటే పిల్లల గాలి పొట్ట కరిగిపోతుంది.
పిల్లల చిగుళ్ళ వాపులకు
పిల్లలకు దంతాలు వచ్చే ముందు చిగుళ్ళు వాస్తే నిప్పుల మీద పొంగించిన వెలిగారము ,తేనె కలిపి మెత్తగా నూరి కొద్ది పరిమాణము చిగుళ్ళ మీద పట్టిస్తూ వుంటే ఆ వాపులు తగ్గిపోతాయి.
నోటి దుర్గంధం
పావు లీటర్ మంచి నీళ్ళల్లో 10gm తేనె కలిపి ,ఆ నీటిలో రోజు 3 పూటలా పుక్కిలించి వూసివేస్తూ వుంటే నోటి దుర్గంధం హరించి పోయి ,నోరు పరిమలంగా వుంటుంది.

స్పొండిలిటీస్ వ్యాధి

పెరుగుతున్న జనాబా ధాటికి దీటుగా ఉన్నామంటూ రోగాలు మానవాళిని వెంటాడుతున్న నేటి రోజులలో ,యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ వారిని పట్టిపీడిస్తున్న వ్యాదులలో SARVAIKIL SPONDDILAITIES ఒకటిగా చెప్పవచ్చు .ఈ వ్యాధిని బారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం లో మన్యాస్తంబం (వాత వ్యాదులలో ఒకటి) గా వివరించారు.


వ్యాధి లక్షణాలు
మెడ వెనుక బాగంలో నొప్పి వెనక కండరాలు బిగిసినట్లు ఉండటము ,బుజాలు మోచేతులు బాగం లో ఉన్న కీల్లల్లో నొప్పి కొన్ని సందర్బాలలో తల నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వివరించవచ్చు .


వ్యాధి కారణాలు
ఎక్కువగా మెడ పైకేతి చూడటం ,ప్రమాదవశాతు తలకు తగిలే గాయాలు ,ఎక్కువ చేదైన ఆహారపదార్ధాలు తినడం ,పగటి యందు నిద్రించుట ,ఎత్తు పల్లాలలో నిద్రించుట ,సక్రమంగా కూర్చొనక పోవడం ,తలక్రింద ఎతైన దిండు ,వస్తువుల వంటివి పెట్టుకుని నిద్రించుట ,కళ్ళు మిక్కుటంగా తెరచి చూచుట వలన ప్రకోపం చెందిన వాతం కఫం తో చేరి తల వెనుక నున్న మన్యలను 14 సిరలను స్తంబింప చేసి ఈ వ్యాధులను కలుగ చేయును .అంతే కాక వెన్ను పూస మరియు 2 వెన్నుల మధ్యనున్న మృదులాస్థి క్షీణించడం వలన ఈ వ్యాధి కలుగును .ఈ వ్యాధి చికిత్సకు ఉపెక్షించినచో కొన్ని సందర్బాలలో పక్షవాతం కూడా రావచ్చు .తొలి దశలోనే గుర్తించి తగు చికిత్సలు చేసినచో ఈ వ్యాధిని సులబంగా నివారించవచ్చు .

ఆయుర్వేద చికిత్సలు
నారాయణ తైలం గోరువెచ్చగా చేసి మెడ బాగం లో మృదువుగా మర్దనా చేయాలి.
సింహనార గగ్గులు గాని ,యోగరాజు గగ్గులు గాని పూటకు ఒక బిళ్ళ చొప్పున రోజుకు 2 పూటలు వేసుకోవాలి.
నెయ్యి కాని ,నువ్వుల నూనె కాని మెడ బాగంలో తిన్నగా మర్దించి ఆముదపు ఆకులను గాని ,జిల్లేడు ఆకులను గాని నూనె పూసి సెగ పెట్టి కాపాలి.
కోడి గుడ్డు లోని సొనను వేడి చేసి అందులో సైంధవ లవణం కలిపి మెడ బాగంలో మర్దన చేయాలి.
రోగి బలహీనులైనచో ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి వాడాలి.
ఇవి కాక వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలసిన కొన్ని ఆయుర్వేద ఔషధాలు వుపయోగించి ఈ వ్యాధి నుండి పూర్తిగా బయట పడవచు.

శృంగార(సెక్స్) సబంధ చిట్కాలు

వీర్య స్థంబన
[1].పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి ,అరకప్పు పాలల్లో కలిపి అందులో 20gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంబన జరుగుతుంది.
[2].చిల్ల గింజలను అంటే ఇండుప గింజల ను పాలలో వేసి నానబెట్టి ముద్దగా నూరి ,అందు లో సమంగా దాల్చినచెక్క చూర్ణము కలిపి నూరి బటాని గింజలంత మాత్రలు చేసి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక మాత్రను పాలల్లో అనుపానంగా సేవిస్తూ వుంటే వీర్య వృద్ధి ,వీర్య స్థంబన కలుగుతాయి.
[3].సొరకాయ ముక్కలను ఆవు నేతి లో వేయించుకుని పరిమితంగా తింటూ వుంటే శీగ్ర స్కలన సమస్య తగ్గి రతిలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు.
[4].రోజు రాత్రి పరుండే ముందు తమలపాకు లో ఒక gm జాపత్రి వుంచి నమిలి తింటూ వుంటే నరములకు సత్తువ పెరిగి ,వీర్య స్థంబన కలిగి రతి సౌక్యము పెరుగుతుంది.
[5].పైడి ప్రతి దూదిని తేనె మైనం తో నూరి వత్తి చేసి ఆ వత్తిని ఆవు నేతి లో వేసి దీపం పెట్టి ఆ వెలుతురు లో స్త్రీ తో సంబోగం జరిపితే పురుషునికి వీర్య స్థంబన కలుగుతుంది.

స్వప్నం లో వీర్య నష్టం
దాల్చిన చెక్క ,చలువ మిరియాలు ,రేవల చిన్ని ఈ 3 పదార్ధాలు ప్రతిది 5gm చొప్పున తీసుకోవాలి.తవాక్శీరి , యాలక గింజలు 10gm చొప్పున తీసుకోవాలి.ఈ వస్తువులన్నీ కలిపి మేతగా దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.రోజుకు 3gm మోతాదుగా 2 పూటలా అర స్పూన్ తేనె కలిపి తింటూ వుంటే స్వప్నం లో వీర్య నష్టం ఆగిపోతుంది.

లింగ బలానికి
[1].ఉదయమే పండ్లు తోముకోక ముందు కొంచెం దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని అరచేతిలో ఉమ్మి వేసుకుని ,దాన్ని లింగానికి ముందు బాగాన్ని వదిలి లేపనం చేస్తూ వుంటే లింగ బలహీనత తొలిగి పోయి మంచి వుద్ధాపన శక్తి కలుగుతుంది.
[2].అశ్వగంధ దుంపను సానరాయి మీద గోమూత్రము లో ఆ గంధాన్ని లింగము పైన (ముందు బాగం వదిలి) లేపనం చేసుకుంటూ వుంటే లింగం బలపడి మగతనం పెరుగుతుంది.
[3].వాకుడు పండ్లు ,పెన్నేరు దుంపలు ,ఆవాలు ,చెంగుల్వ కోష్టు సమబాగాలుగా కలిపి పొడి చేసి ఉంచుకుని ,రోజు కొంచెం పొడిని నీటితో మెత్తగా నూరి పురుషులు తమ మర్మాంగానికి బుడిపే బాగం వదిలి వెనుక బాగానికి లేపనం చేసి అది ఆరి పోగానే వెంటనే ఆలస్యం చేయకుండా గుడ్డతో తుడిచి కడిగి వేయాలి.ఈ విధంగా 40 రోజులు రోజు కు ఒకసారి చేస్తే లింగ బలహీనత తగ్గి బలం కలుగుతుంది.ఇది అనుబవగ్నులైన ఆయుర్వేద వైద్య పండితుల ఆధ్వర్యం లో తయారు చేయించుకుని వాడుకోవాలి.

వీర్య వృద్ధి
[1].నేతిలో వేయించిన మినప పప్పును ఆవు పాలలో వేసి తగినంత చెక్కర కలిపి పాయసంలా వండి రోజు తింటూ వుంటే శరత్కాలము లోని చంద్రుని వలె పురుషులు వలె పురుషులు వీర్య దోష వర్జితులై ప్రకాశిమ్పగలరు.
[2].కర్జూర పండు ,మర్రి వూడలు కలిపి పాలతో నూరి వడపోసి తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి కలుగుతుంది.
[3].అతిమధురం ,నెల తాడి దుంపలు ,పిప్పళ్ళు ,దూల గొండి గింజలు ఈ 4 సమబాగాలుగా తీసుకుని చూర్ణం కొట్టి నిలువ వుంచుకోవాలి.పూటకు 3gm ల చూర్ణము ,6gm పటిక బెల్లం పొడి ,6gm ఆవు నెయ్యి ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి 2 పూటలా తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి అవుతుంది.
[4].తులసి విత్తులు , నాగాకేసరములు ,అశ్వగంధ ,మోదుగ ,రావి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క gm వంతున సేకరించి బాగుగా మర్దించి వస్త్ర గాలితము గావించి 10gm ఆవు పాలలో కలిపి సేవించిన 2 నెలల్లో బహిష్టు సక్రమ మగును ,ఏదో కారణమూ చేత ఆగిపోయిన బహిష్టు కూడా సరిఅగును.

బహిష్టు నొప్పి
రుతుమతులైన దినములందు 3 రోజుల పాటు ప్రతి ఉదయం 2gm మిరియాల చూర్ణమును 10gm నెల ఉసిరిక రసంతో కలిపి మింగిన యెడల రుతువుల నిస్సంశయముగా హరిన్చిపోవును.

బహిష్టు ఆగిపోతే
[1].వేప చెట్టు బెరడు 20gm ,శోంటి 2gm ,పాతబెల్లం 20gm ఈ మూడు కలిపి దంచి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం మిగిలేల మరగబెట్టి వడపోసి చల్లార్చి రోజు ఉదయం పూట మాత్రమే తాగుతూ వుంటే 4 రోజుల్లో ఆగిపోయిన బహిష్టు మళ్ళి మొదలవుతుంది.
[2].ప్రత్తి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కషాయం కాచి వడ పోసి అర పావు లీటర్ కషాయంలో 20gm పాత బెల్లం కలిపి రోజు ప్రాతఃకాలమందు తాగుతూ వుంటే అతిత్వరలోనే బహిష్టు మొదలవుతుంది.
[3].అరటి ఊచ రసము 2 పూటలా 20gm మోతాదుగా సేవిస్తూ వుంటే ఆగిపోయిన బహిష్టు మరల మొదలై సాఫీగా వస్తూ వుంటుంది.

స్త్రీల స్తనముల బాధ
వెర్రి పుచ వేరును మంచి ఆ గంధాన్ని చన్నుల మీద లేపనం చేస్తూ వుంటే స్థానాలకు సంబంధించిన అన్ని బాధలు హరిన్చిపోతై.

లింగ పటుత్వం
ప్రతి గింజల పప్పు ఒక బాగము ,మేక కొవ్వు 2 బాగములు కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని లింగానికి ముందు బాగం వదిలి వెనుక బాగానికి లేపనం చేస్తూ వుంటే లింగం వంకర పోవుట లింగం ముడుత పడుట హరించి బలపడుతుంది.

బహిష్టు లో అధిక రక్త స్రావానికి
యష్టి మధుకం చూర్ణం పూటకు 3gm మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళల్లో 3 పూటలా తాగుతూ వుంటే అతి త్వరగా అధిక ఋతు స్రావము ఆగిపోతుంది.

వీర్య శక్తి
యావాలు మినుములు నానబెట్టి పొట్టు తీసి ఆ పొడిని పాలలో కలిపి పంచదార వేసి పాయసం లాగ వండి రోజు తింటూ వుంటే 40 రోజు లా తరువాత అమితమైన వీర్య శక్తి కలుగుతుంది.

ప్రత్తి చెట్టు ఔషధగుణాలు

స్త్రీల ఎర్రబట్ట
ప్రత్తి వేరును బియ్యం కడిగిన నీళ్ళతో మెత్తగా నూరి వడపోసి ,ఆ రసం 20gm ,మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.

చర్మ రోగములు
ప్రత్తి వేరు ను ,ప్రతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గి పోతాయి.

కీళ్ళ నొప్పులకు
లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ,ఆముధముతో గాని ,ఆవు నెయ్యి తో గాని ఉడికించి. కీళ్ళ మీద వేసి కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

విషాల విరుగుడుకు
ఎర్ర పతి కాయలను దంచి రసం తీసి వడ పోసి 20 gm మోతాదుగా 2 లేక 3 సార్లు తాగితే నాబి మొదలైన పదార్ధాల విషం విరుగుతుంది.

కాలిన పుండ్లకు
ప్రత్తి పూవులను దంచి రసం తీసి ఆ రసాన్ని కాలిన పుండ్ల మీద లేపనం చేస్తూ వుంటే కాలిన పుండ్లు తగ్గిపోతాయి.

విరేచనం
ప్రతి ఆకు నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి గుద స్థానానికి తగిలేలా చేసుకుంటే ,మాటిమాటికి విరేచనం అవుతున్నట్లుగా వుండే సమస్య నివారిమ్పబడుతుంది.

సుక ప్రసవము
ప్రతి ఆకు రసము గిద్దెడు ,ఆవు పాలు గిద్దెడు కలిపి తాగిస్తే స్త్రీలు సుకంగా ప్రసవిస్తారు.

యోని పటుత్వం
ప్రత్తి వేళ్ళను నలగగొట్టి నీటిలో వేసి కాషాయం కాచి ,వడపోసి చల్లార్చి ఆ కషాయం తో స్త్రీలు తమ యోనిని పలు మార్లు కడుక్కుంటూ వుంటే వృద్ధ స్త్రీల యోని అయినా గట్టి పడుతుంది.

వీర్య స్థంబనకు
పైడి ప్రతి దూదిని తేనెతో మైనంతో నూరి వత్తి చేసి ఆ వత్తిని ఆవు నేతిలో వేసి దీపం పెట్టి ,ఆ వెలుతురు లో స్త్రీ తో సంబోగం జరిపితే పురుషునికి వీర్య స్థంబన కలుగుతుంది.

లింగ పటుత్వానికి
ప్రత్తి గింజల పప్పు ఒక బాగము ,మేక కొవ్వు 2 బాగాలు కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని లింగానికి ముందు బాగం వదిలి వెనుక బాగం లేపనం చేస్తూ వుంటే లింగం వంకర పోవుట ,లింగం ముడతపడుట హరించి లింగం బలపడుతుంది.

పండ్ల లోని క్రిములకు
ప్రత్తి గింజలను బాండీలో వేసి మాడ్చి ఆ మసితో పళ్ళు తోముకుంటే పళ్ళ లో చేరిన పురుగులు హరించి పళ్ళు ఆరోగ్యవంతంగా వుంటాయి.

కళ్ళ నొప్పులకు
ప్రత్తి ఆకులను మజ్జిగతో ఉడకబెట్టి కళ్ళ మీద వేసి కట్టుకుంటూ వుంటే కండ్ల నొప్పులు సులువుగా పోతాయి.

కను రెప్పలు ఊడుతూ వుంటే
మంచి ప్రత్తిని ఒక గిన్నెలో వేసి అది మునిగేల ఉమ్మేత్తాకు రసం పోసి రాత్రి అంతా నానబెట్టి ఉదయం పూట ఎండలో పెట్టి రసమంతా ఎగిరి పోయే ల ఎండబెట్టాలి.ఇలా 3 రోజు ల పాటు ఉమ్మేత్తాకు రసం తోను ,3 రోజుల పాటు గుంటగలగార ఆకు రసం తోను బావన చేసి బాగా ఎండిన తరువాత ఆ ప్రత్తి వత్తి లాగ చేసి నువ్వుల నూనె దీపంలో వేసి వెలిగించి ,దాని మంట మీద రాగి పళ్ళెం ఆనించి దానిని మసి పట్టి ఆ కాటుకాను ప్రతి రోజు కండ్లకు పెట్టికొంటూ వుంటే కను రెప్పల వెంట్రుకలు ఊడటం ఆగిపోతుంది.

చెవిలో చీముకు
ప్రతి ఆకులు దంచి రసం తీసి వడపోసి ఆ రసంలో కొద్దిగా గుగ్గిలం ,తేనె కలిపి ,చెవుల్లో 4 చుక్కలు వేస్తూ వుంటే చీము కారటం తగ్గిపోతుంది.

సెగ రోగములకు
ప్రతి గింజలు ,దిరిసెన గింజలు ,పెను వేప గింజలు సమంగా కలిపి అందులో తగినన్ని మర్రి పాలు పోసి ముద్దగా దంచి ఆ ముద్దను బటాని గింజలంత టాబ్లెట్ చేసి ఆరబెట్టి నిలవ చేసుకోవాలి.రోజు ఉదయం పూట ఒక టాబ్లెట్ వేసుకుని పాలు తాగుతూ వుంటే సకల సెగ రోగాలు హరించి పోతాయి.

బహిష్టు ఆగిపోతే
ప్రతి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కాషాయం కాచి వడపోసి ,అరపావు లీటర్ కషాయం లో 20gm పాత బెల్లం కలిపి ప్రాతకాలంలో తాగుతూ వుంటే అతి త్వరలోనే బహిష్టు విడుదల అవుతుంది.

వాపులు-వాత నొప్పులు
ప్రత్తి గింజలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా నూరి వాపుల మీద వాత నొప్పుల మీద పట్టు వేస్తూ వుంటే అవి తగ్గి పోతాయి.

కాళ్ళ వాపులకు
ప్రతి ఆకు దంచి రసం తీసి ఆ రసాన్ని రాత్రి పూట కాళ్ళకు పట్టిస్తూ వుంటే కాళ్ళవాపులు 4 రోజుల్లో తగ్గి పోతాయి.

గవద బిళ్ళలు
ప్రతి ఆకు దంచి చక్కటి రసం తీసి ఆ రసాన్ని గవద బిళ్ళల మీద లేపనం చేసి పైన దూది అంటిస్తూ వుంటే గవద బిళ్ళలు కరిగిపోతై.

ఎలుక కాటు విషానికి
ప్రతి ఆకు రసం 50gm ,బియ్యం కడిగిన నీళ్ళు 100gm ,కలిపి రోజుకొక మోతాదుగా రోజు ఉదయం పూట తాగుతూ వుంటే ఎలుక కాటు విషం ఎగిరి పోతుంది.

సుక ప్రసవం
ప్రత్తి గింజలు ,మర్రి ఊడల కోణాలు ,గుమ్మడి ఆకులు ఈ 3 సమంగా తీసుకుని మంచి నీటితో మేతగా నూరి ఆ కల్కాన్ని గర్బిణీ స్త్రీ అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే త్వరగా సుక ప్రసవం జరుగుతుంది.

గడ్దలకు-బిళ్లలకు
ప్రత్తి గింజలను నీళ్ళతో ముదగా నూరి ఆ ముద్ద ను గడ్డల మీద లేక బిల్లల మీద వేసి కడుతూ వుంటే అవి త్వరగా తగ్గిపోతాయి.

రక్త - జిగట విరేచనాలు
ప్రత్తి ఆకుల రసం 30gm పటిక బెల్లం పొడి 30gm , కలపి పూటకు ఒక మోతాదుగా రోజుకు 2 లేక 3 సార్లు పుచుకొంటూ వుంటే సులువుగా రక్త ,జిగట విరేచనాలు ఆగిపోతాయి.

తేలు విషానికి
ప్రతి ఆకులు ,ఆవాలు కలిపి మేతగా నూరి ఆ మిశ్రమాన్ని తెలుకుట్టినచోట వెంటనే మర్దిస్తే విషం వెంటనే క్రిందకు దిగి ,బాధ నిమిషాల మీది తగ్గిపోతుంది.

పిచ్చి కుక్క కాటుకు చికిత్సలు

[1].గోవు పిత్తము ,తేనె ఈ 2 సమంగా గ్రహించి మనిషి మూత్రములో మెత్తగా నూరి దాన్ని రోగికి అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే పిచ్చి కుక్క విషం విరిగి పోతుంది.
[2].అడవి జీలకర్ర అంటే చేదు జీలకర్ర తెచ్చి పొడి కొట్టి పూటకు 10gm ప్రమాణంగా మంచి నీటితో కలిపి 2 పూటలా సేవిస్తూ వుంటే కేవలం 3 రోజుల్లోనే మహా గోరమైన వెర్రి కుక్క విషము నిస్సంశయంగా హరిస్తుంది.
[3].కలబంద రసము ,సైంధవ లవణము 2 కలిపి వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు 20gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లోనే వెర్రి కుక్క విషం హరిన్చిపోతుంది.
[4].ఉత్తరేణి వేరు తేనె తో నూరిన ముద్ద 10gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ కలబంద గుజ్జు సైంధవ లవణము కలిపి నూరిన ముద్దను గాయం మీద వేసి కడుతూ వుంటే పిచ్చి కుక్క విషం విరుగుతుంది.
[5].వేప విత్తనాలు ,కోడి శిపాల విత్తనాలు ,చందనము ,తామర పూవులోని కేసరాలు ఈ 4 సమబాగాలుగా కలిపి నూరి 20 gm మోతాదుగా 2 పూటలా ఆవు పాలతో కలిపి తాగుతూ వుంటే వెర్రి కుక్క విషము విరుగుతుంది.
[6].10gm మనిషి వెంట్రుకలను కాల్చి మసి చేసి ఆ మసిని నువ్వుల నూనె లో కలిపి తాగిస్తే వెర్రి కుక్క విషం విరుగుతుంది.
[7].కాకరాకును నూరి పసరు తీసి ఆ పసరును శరీరమంతా లేపనం చేసి అది ఎండిపోగానే స్నానం చేస్తూ వుంటే విషం హరిస్తుంది.
[8].కుప్పింతాకు[మార్కొండాకు) ,వెల్లుల్లి ఈ 2 సమంగా కలిపి నూరి ఆ ముద్దను ఆముదములో కలిపి ఉడకబెట్టి 3 రోజు ల పాటు 2 పూటలా పూటకు 10 నుండి 20gm మోతాదుగా సేవింప చేస్తూ వుంటే వెర్రి కుక్క ,నల్ల పిల్లి విషం హరిస్తుంది.
[9].సుగంధ పాల వేళ్ళు రసం తీసి వడపోసి ,2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[10].కానుగ చెట్టు వేళ్ళను దంచి రసం తీసి ఆ రసాన్ని వడపోసి 2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[11].విష్ణుక్రాంత సమూలముగా గాని ,సూర్యక్రాంత సమూలముగా గాని తీసుకొచ్చి మనిషి మూత్రములో నూరి రసం తీసి వడపోసి 3 రోజు ల పాటు 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[12].మంచి పసుపు ,చేగాల్వ కోష్టు ఈ 2 సమంగా తీసుకుని గోమూత్రములో కలిపి నూరి వడపోసి 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[13].తెల్ల గురివింద వేరు వస సమంగా కలిపి నూరి గంధం తీసి ఆ గంధాన్ని చల్లని నీటితో కలిపి తాగిస్తూ వుంటే విషం హరిస్తుంది.
[14].చేదు సొరచెట్టు వేరు గాని ,ఆకు గాని ,బెరడు గాని మంచి నీటితో నూరి వడ పోసి పూటకు 5gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లో వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[15].బెల్లము ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు ఈ 3 కలిపి నూరి గాయం మీద పట్టించిన లేక బెల్లపు పాకం లాగ ఎర్రగా జిగటగా వుండే కోడి మలాన్ని గాయం మీద లేపనం చేసినా వెర్రి కుక్క విషం విరిగి హరిన్చిపోతుంది.

పసుపు తో ఆయుర్వేదం

దగ్గులు-పిల్లికూతలు
వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.
నేత్ర వ్యాధులు
పరిశుబ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తై.
గడ్డలు ,గాయాలు ,బెనుకులు
పసుపు గాని ,పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు ,గడ్డలు ,గాయాలు ,కవుకు నొప్పులు ,బెనుకులు హరించి పోతాయి.
తల రోగములు
పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము ,తల పోట్లు ,పార్శ్వపు నొప్పి , అపస్మారము శాంతిస్తై.పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.
చెవిలో చీము
పసుపు పొడి ,పటిక పొడి కలిపి దూడతో చెవిలో పెట్టి ఊదితే చెవి నుండి కారే చీము ,నెత్తురు ,రసిక తగ్గి పోతాయి.
గోరుచుట్టూ -మడమశీల
పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టూ ,మడమ శూల ,జెట్టలు ,గడ్డలు ,కానుపు మాదలు మొదలైనవి హరించి పోతాయి.
పురుగులకు
పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశిన్చిపోతై.
స్పోటకం మచ్చలకు
పసుపు ,వేపాకు కలిపి ముదగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు ,పుండ్లు మానిపోతై ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవాచు.
మధుమేహం
మంచి పసుపు ,ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ 2 సమబాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10gm మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం కుదురుతుంది.
కనురెప్పలు రాలుతుంటే
నిమ్మపందుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి .తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి.మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి.ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు ,కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.

మునగ చెట్టు తో ఆయుర్వేదం

[

1]. LETHA MUNAGAAKUNU KOORAGAA VANDUKUNI LEDHA PAPPU LO VESUKUNI GAANI BUJISTHE VAATHA SLESHMA VYAADHULU THAGGI POTHAAI.

[2].MUNAGAAKU RASAMU OKA SPOON KONCHEMU LAVANAMU KALIPI PILLALAKU THRAAGISTHE AJEERNAM THOLAGUTHUNDHI.

[3].MUNAGAAKU RASAANNI 1,2 CHUKKALU VESTHE NETHRA VYAADHULU SHAMISTHAAYI.

[4].MUNAGAAKU RASAM , MIRIYAALU KALIPI NOORI THALAKU PATTU VESTHE JALUBU , THALADHIMMU POTLU THAGGI POTHAAI.

[5].MUNAGAAKU , AAMUDHAMUTHO KALIPI NOORI VEDI CHESI VRUSHANAALA PAI KADITHE VAAPU THAGGUTHUNDHI.

[6].KEELLA NOPPULU VAAPU VEDHANA THO KOODU KONI YUNA MUNAGAAKUNU DHANCHI NOONE THO VUDIKINCHI KEELLA PAI VESI KATTAALI.

[7].MUTTU SHOOLAALA THO BAADHA PADUTHUNNA STHREELU, PIDIKEDU LETHA MUNAGAAKULU , OKA ULLIPAAYA KALIPI NOORI MUDHA CHESUKUNI RAJODHARSHANAMAINDHI MODHALU 5 ROJULU KADUPU LONIKI THEESUKOVALENU.

[8].NAARI KURUPU VYAADHI LO MUNAGAAKUNU NOORI KATTINA BADHOPASHAMANAMU JARAGATAME KAAKA NAARI PURUGULU BAYATIKI VASTHAAYI.

[9].VRANAMULU , GAAYAMULU , VAAPULA PAI MUNAGAAKU NOORI KATTINA THAGGI POTHAAI.

[10].CHARMA VYAADHULALO MUNAGAAKU LEDHA MUNAGA PATTA KASHAAYAANNI ROJUKU 2 SAARLU ARA OUNSU CHOPPUNA THAAGINCHAALI.

[11].PILLALA LONI NULI PURUGULU KOSAM MUNAGAAKUTHO THAYAARU CHESINA KASHAAYAANNI THAAGINCHINA KRIMULU POVADAME KAAKA UDHARASHOOLA SHAMISTHUNDHI.

[12].KADUPU NOPPI , SEGA GADDALA PAI MUNAGA KAANDAPU THOKKANI NOORI LEPANAMU CHEYAALI.

[13].MUNAGA BEEJAMULANU CHOORNAMU CHESI NASYAMU MAADHIRIGAA PEELCHINA DHEERGA KAALIKAMUGAA NUNNA SISASSOOLAALU THAGGIPOTHAAI.

[14].KEELLA NOPPULU , MOOGA DHEBBALU , BENUKU MODHALAINA NOPPITHO KOODUKONIYUNNA VAAPULALO MUNAGA BEEJAMULA THAILAMUNU RAAYAALI LEDHA MARDHANAA CHEYAALI.

[15].KANDLALO SHUKLAMU UNNAVAARIKI MUNAGA GINJALA THAILAANNI NITHYAM 1,2 CHUKKALU DHEERGA KAALAMU UPAYOGINCHINA AAPARESHANU AVASARAMU VUNDADHU.

[16].MUNAGA GINJALATHO KAATUKA CHESUKUNI VIVIDHA NETHRA VYAADHULA NUNDI RAKSHANA PONDHAVACHU.

[17].MUNAGA PATTA RASAANNI 1,2 CHUKKALU CHEVILO VESTHE CHEVI POTU THAGUTHUNDHI.

[18].MUNAGA JIGURUNU CHESI KARIGINCHI NITHYAM CHEVI LO VESTHUNDINA DHEERGA KAALIKANGA VEDHINCHU CHEVILO CHEEMU THAGGUTHUNDHI.

[19].MANAGA VELLANU DHANCHI RASAANNI THEESI PAALALO KALIPI THAAGINCHINA MOOTHRA PINDAALALONI RAALLU KARIGIPOTHAAI.

[20].SHVAASA , AASMAALALO MUNAGA VERU RASAMU , ALLAPU RASAMU SAMAANAMU KALIPI 1,2 CHUKKALU THAAGINCHAALI.

[21].NORU PAGALATAM , GONTHU NOPPILO VERU KASHAAYAMUTHO PUKKILINCHAALI.

[22].PIPPI PANNU NUNDI RAKSHANA PONDHATAANIKI MUNAGA JIGURUNU NOTLO PETTUKUNI CHAPPARISTHOO VUNDAALI.

[23]RECHEEKATLO , LETHA MUNAGAAKU RASAMLO THENE KALIPI KANTLO CHUKKALU VESTHUNDINA LAABAMU CHEKLOORTHUNDHI.

[24].ANNI MOOTHRA SAMBANDHA VYAADHULALO OKA THULAMU MUNAGA JIGURU PRATHI ROJU PERUGULO KALUPUKUNI 7 ROJU LU SEVINCHAALI.

[25].PURUSHULALO MAGATHANANNI VRUDHI CHEYATAANIKI YELAKKAAYALU , LAVANGAALU , MIRIYAALU SAMAANANGAA THEESUKUNI MUNAGAKAANDAMULO RANDHRAMU CHESI ANDHULO 9 ROJU LA VARAKU NIKSHPTHAM CHESI AA THARUVAATHA VAATINJI BAYATAKU THEESI CHOORNINCHI ARACHEMCHAADU PRATHINITHYAM THINAALI.

మర్రిచెట్టు తో ఆయుర్వేదం

[19]. లేత మర్రి చెట్టు ఊడలను నీళ్ళతో మెత్తగా మర్దించి వాలిపోయిన స్తనముల పైన లేపనము చేయుచుండిన 3 వారములలో కన్య స్తనముల వలె ధృడముగా ఉండును.

[20]. లేత మర్రి ఆకులను నీడన ఆరబెట్టి ,ఎండబెట్టి చూర్ణము గావించి పూటకు 3gm చూర్నమును పాలు ,పంచదార కలిపి సేవించు చుండిన 40 రోజు లలో నీరుడు బిగించే మూత్ర కచ్చ వ్యాధి జీవితాంతము రాకుండా హరించి పోవును.

[21]. మర్రి ఊడల చివర వుండు పీచు లాంటి సన్నని వేళ్ళను నీటిలో నూరి త్రాగించుచుండిన యెడల ఏ మందుల వలన కూడా తగ్గనటువంటి డోకులు తగ్గిపోతాయి.

[22]. మర్రి ఊడలను పెరుగుతో నూరి పైన పట్టు వేసిన శరీరము పై కాలిన అంగముల యందలి మంట వెంటనే శాంతించును.

[23]. మర్రి ఊడల కోణాలను దంచి తీసిన రసము పూటకు 2 తులాల చొప్పున ఇచ్చుచుండిన కళ్ళతో రక్తము పడే వ్యాధి హరించును.

[24].లేత మర్రి ఊడలను నీడన ఆరబెట్టి ,ఎండించి చూర్ణము గొట్టి అందు సమబాగమున పంచదార కలిపి పూటకు అర తులము చొప్పున వారము రోజులు సేవించిన యెడల మూత్రము ,పచగా వాచుట ,వీర్యము పలుచబదుట ,మూత్రము బోయునప్పుడు మంట మొదలగు మెహ వ్యాధులు హరించి శరీరమునకు బలము కలుగును.

[25]. కత్తి మొదలగు ఆయుధములచే పెద్ద పెద్ద గాయములు ఏర్పడినపుడు గాయము యొక్క 2 అంచులను ఒకటిగా జేర్చి పైన వెచ్చజేసినా మర్రి ఆకును వేసి కట్టు కట్టిన యెడల 3 రోజులలో చర్మం ఆశ్చర్యముగా కలిసిపోవును.

[26]. మర్రిచెట్టు యొక్క పాచి కాయలను ఎండించి ,చూర్ణము గావించి పాటకు 15gm చూర్నమును అర గ్లాస్ పాలు పంచదార కలుపుకుని సేవించుచుండిన యెడల శరీరమునకు అధిక బలము కలుగును.

[27]. ఎండించిన మర్రి ఊడలను బస్మము గావించి 3gm బస్మమును నీళ్ళతో కలిపి ఇచ్చు చుండిన యెడల డోకులు కట్టును ,వంతులు హరించును.

[28]. సెగ గడ్డల పైన మర్రి ఆకును వేచా జేసి కట్టిన యెడల తొందరగా పగిలి పోవును.

[29]. పండు మర్రి ఆకులను కాల్చి బస్మము చేసి అందు తేనె ,మైనము ,నెయ్యిని ,కలిపి మేతగా నూరి పుండ్లు పై పట్టించిన యెడల అన్ని రకముల పుండ్లు హరించును.

[30]. లేత మర్రి ఆకులను ఎండబెట్టి చూర్నించి అందు సమబాగమున పంచదార కలిపి 10gm చొప్పున మంచి నీళ్ళు అనుపానముతో సేవించు చుండిన స్త్రీల యొక్క తెల్ల బట్ట వ్యాధి హరించును వేడి చేసే పదార్ధాలు తినకుండా ఉండవలెను.

[31]. లేత మర్రి ఆకులూ మెత్తగా నూరి అందు తేనె పంచదార కల్పుకుని ప్రాతహకాలమందు తినుచుండిన యెడల రక్త పిత్త వ్యాధి తగ్గును.

మర్రిచెట్టు తో ఆయుర్వేదం

[1]. మర్రి ప్రాంతకాలమందు ఒక గ్రాము ఎత్తు చొప్పున మొదటి రోజున పంచదార పాకములో కలిపి పుచుకోనవలెను.2 వ రోజు 2gm ఏతు మర్రిపాలు పంచదార పానకములో కలిపి పుచ్చుకొనవలెను.ఇట్లు రోజుకు ఒక్కొక్క gm పాలు ఎక్కువ చేయుచు 11 రోజులు సేవించి 12 వ రోజు నుంచి ఒక్కొక్క gm ఏతు పాలు తాగించుచు తిరిగి gm ఏతు పాలు తగ్గించుచు తిరిగి 11 రోజు లు మర్రి పాలను పంచదార పానకములో కలిపి సేవించు చుండిన యెడల వీర్య నష్టము ,మూత్ర బంధము ,స్త్రీల బట్టంటూ వ్యాధులు సంపూర్ణముగా హరించి మెదడుకు ,గుండెకు బలము కలిగి ,శరీరము ఆరోగ్యముతో పుష్టిగా ఉండును.

[2]. నీళ్ళల్లో ,బురదలో తిరుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో పాచి పుండ్లు పడి,అపరిచితమైన దురదలు ,బాధలు కలుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో మర్రి పాలు పట్టించు చుండిన అన్ని బాధలు తక్షణమే తగ్గిపోవును.

[3]. శరీరము పైన ఎక్కడైనా మంటగా ఉన్న యెడల మర్రి పాలు పైన రాసిన వెంటనే తగ్గిపోవును.

[4].కాళ్ళ పిక్కల పైన, తొడల పైన లేచెడి కురుపులకు గడ్దలకు మర్రి పాలు పట్టి వేసిన తొందరగా అణిగి పోవుట గాని పగిలిపోవుట గాని జరుగును.

[5]. నడుము నొప్పికి పైన మర్రి పాలు పట్టీ వేసిన యెడల తగ్గిపోవును.ఇట్లు 3 పట్టీలు వేయవలెను.

[6]. పిప్పిపంటిపై మర్రి పాలు 3 చుక్కలు వేసిన పురుగు చచ్చి బాధ తగ్గును.

[7]. చెవి పోటుకు 2 చుక్కల మర్రి పాలు చెవిలో వేసిన పురుగు చచ్చి చెవి పోటు తగ్గును.

[8]. ఒక చుక్క మర్రి పాలను కంట్లో వేసిన కంట్లో మంటలు తగ్గిపోవును.

[9]. పోటు పుట్టుచుందే సెగ గడ్డలపైన ,మర్రి పాలు పట్టి వేయుచుండిన యెడల బాధలు వెంటనే శాంతించును.

[10]. బొడ్డు లోపల ,బొడ్డు చుట్టూ మర్రి పాలు పట్టించిన యెడల అన్ని రకముల విరేచనములు అద్బుతముగా తగ్గును.

[11]. 2gm మర్రిపాలను పంచదార లో కలుపుకుని ప్రాంత్హకాలమందు తినవలెను ఇట్లు 3 రోజులు ఉదయం పూట తినిన యెడల మూత్ర బంధము మూత్రము బొట్లు బొట్లు గా పడుట హరించును.

[12]. రాకత మొలల వ్యాధి వలన గాని ,స్త్రీల ఎర్రబట్ట వ్యాధి వలన గాని లేక మరియే ఇతర కారణము చేతనైన శరీరము నుండి పై బాగము గుండా రక్తము పోవు చున్న యెడల 5,6 చుక్కల మర్రి పాలను పంచదార పానకములో తాగించావలెను.

[13]. మెడ చుట్టూ గడ్డలు లేచే కంట మాల వ్యాధి పైన మర్రి పాలు పట్టీ వేయుచుండిన యెడల తొందరగా నయమగును.

[14]. కత్తి నరుకులపై గాని లేక ఏ విధమైన గాయముల పై గాని మర్రి పాలను పట్టించిన యెడల గాయమును తొందరగా మాన్పి ,చర్మమును అతుక్కోనునట్లు చేయును.

[15]. మర్రి చెట్టు పై చర్మమును దంచి నీళ్ళల్లో కాచి ఇచ్చిన అతి మూత్ర వ్యాధి హరించును.

[16]. మర్రి చెట్టు పాచి బెరడును దంచి తీసిన రసమును పూటకు 10gm చొప్పున త్రాగించుచుండిన యెడల మధుమేహ వ్యాధి నిస్సందేహముగా హరించును.

[17]. మర్రి చెక్క ,రావి చెక్క 2 కలిపి దంచి ,కషాయము కాచి ఆ కశాయముతో పుక్కిలించి ఉమ్మి వేసిన యెడల చిగుళ్ళ వాపు వంటి బాధలు హరించును.

కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం

[1]. కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.

[2].కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.

[3].కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.

[4].కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.

[5].కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.

[6].కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.

[7].రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.

[8].కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.

[9].కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.

[10].చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.

[11].కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.

[12].పంటి నొప్పి ,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని ,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.

[13].దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.

[14].కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.

[15].అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.

[16].చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.

[17].కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.

[18].ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.

[19].కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.

అతి సులువైన జానపద వైద్య విధానాలు

గొంతులోని పుండ్లు మరియు కాంతులు నివారణకు
బోజనము ముందు నేతిలో మిరియము పొడిని 2gm మోతాదుగా కలిపి సేవించవలెను .

నడుము నొప్పి
[1].హారతి కర్పూరము ,సాంబ్రాణి మెత్తగా నూరి గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[2].నొప్పి గల చోట బాగుగా ఆముధమును రాసి జిల్లేడు ఆకుల విస్తరి కుట్టి నొప్పి గల చోట కట్టి నులక మంచము పెట్టి క్రింద మేక ఎరువుతో కుంపటి పెట్ట వలెను.

[3].దేశవాళి గుగ్గిలము ఆముధమున నూరి నీళ్ళను కడిగిన వెన్న వలెనగును.దానిని గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[4].కర్పూర తైలముతో పట్టు వేయవలెను.

పెదవుల పగుళ్ళు
ఉప్పును నేతితో నూరి పెదవులకు పూసిన పగుళ్ళు మానును .

కాలిన గాయాలు
[1].మజ్జిగలో సుద్దను కలిపి రాయవలెను.

[2].కాలిన గాయాల పై చల్లని తడి మన్నును రాయవలెను.

[3].మూత్రమును ఆరగ ఆరగ రాయవలెను.

[4].కలబంద రసమును వేసి కట్టు కట్టవలెను.

[5].సున్నపు నీళ్ళలో కొబ్బరి నూనె ను వేసి గట్టిగా చిలికి దానిలో గుగ్గిలము పోడుమును వేసి పాకముగా వండి పూయవలెను.

[6].కాలిన చోట బ్రాంది పోసిన పొక్కక మంటను తగ్గించును.

అజీర్ణము
[1].వాము ,ఉప్పు ,మిరియాలు సమపాళ్ళల్లో కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున మూడు వేళ్ళకు వచునంత సేవించవలెను.

[2].రెండు చింత గింజలను పెనం పై కాల్చి పోట్టును గీకి వేసి నోటిలో వేసుకుని పోకల వలె నమిలి మింగిన అజీర్ణము దానివలన కలిగిన గుండె మంట నివారనమగును.

[3].40gm నిమ్మరసములో ,జీలకర్ర 3 gm ,సైంధవ లవణము 3gm ,అల్లపు ముక్కలు 10gm ,వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.

[4].దాల్చిన చెక్క ,యాలకులు ,మిరియాలు సమపాళ్ళలో పొడి చేసి కలిపి పొడి చేసి పూటకు 3gm చొప్పున బెల్లముతో కలిపి పుచ్చుకోనవలెను .

[5].నీరుల్లిపాయను పచ్చి దానిని ముక్కలుగా కోసి బోజనముతో తినవలెను.

[6].నేతిలో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణమగును.

[7].నిమ్మరసములోతినే సోడాను 5 gm కలిపి ఒక ఔన్సు నీళ్ళను కలిపి తాగవలెను.

[8].గిద్దెడు నీళ్ళల్లో ఒక తులము ఉప్పును కలిపి తాగవలెను.

[9].పంచదార లేక బెల్లపు పానకమును పుచ్చుకోనవలెను .

[10].రాత్రి రాగి చెంబులో పోసి యుంచిన నీటిని ఉదయము పరగడపున తాగవలెను.

ఆకలి అగుటకు
[1].రెండు గ్రాముల అల్లములో కొంచెము ఉప్పును వేసి ఉధయముననే తినవలెను.

[2].5gm ల శోంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీళ్ళల్లో కలిపి పూచుకోనవలెను.

అరుచి
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.

[2].ఆవాలను నూరి నాబి పైన ప్రతి రాత్రి పట్టు వేయవలెను.

[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.

[4].బోజనమున మొదటి ముద్దలో శోంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను.

శ్వేత కుష్టు(బొల్లి)
[1].వేప కాయలు , పువ్వ్వులు , ఆకులను కలిపి నూరి అర తులము పూటకు చొప్పున 4 రోజులు సేవుంచావలెను.

[2].రోగి పురుషుడైన స్త్రీ ఋతు రక్తమును శ్వేత కుష్టు మచలపై పూయవలెను.రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచ్చల పై పూయవలెను .ఇట్లు చేసిన శ్వేత కుష్టు మచ్చలు శాశ్వతముగా నివారనమగును.

నేత్ర వ్యాధులు
కలబంద లో పటిక కలిపి కండ్లలో పోసిన కంటి దెబ్బలు పోవును.

గసగాసాలతో ఆయుర్వేదం

వీర్యస్తంబనకు
పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి ,అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంబన కలుగుతుంది.
దేహమునకు చలువ చేయుటకు
10gm గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ వుంటే ఉష్ణ శరీరం కలవారు అధిక వేడి తగ్గి దేహం చలువ చేస్తుంది .
చుండ్రుకు-వెంట్రుకలు పెరుగుటకు
గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మేతగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ వుంటే తలలో కురుపులు చుండ్రు తగ్గి పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి .
శిరోవాతమునకు
గసగసా లు 10gm ,యాలకులు 10gm , సోంపు గింజలు 10gm .ఈ పదార్ధాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 60gm ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగే నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి దించి వడపోసి నిలువ ఉంచుకుని దీనిని రోజు తలకు రాసుకుంటూ వుంటే తల దిమ్ము ,తల నొప్పి ,పార్శ్వపు నొప్పి హరించి పోయి మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా వుంటుంది.
గర్బినీల రక్త జిగట విరేచనాలు
గసగసాలు 10gm లు , పటిక బెల్లం 20gm కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని ,పూటకు 5gm పొడిని 20 gm వేన్నలో కలుపుకుని రోజు 2 లేదా 3 పూటలు తింటూ వుంటే గర్బినీలకు కలిగే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవును. అన్నంలో పెరుగు కలుపుకుని తినవలెను.
జిగట విరేచనాలు
గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటలా పూటకు 5 gm నుండి 10 GM మోతాదుగా అన్నంలో కలిపి తింటూ వుంటే 2 లేక 3 రోజుల్లో జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
నిద్ర రాకపోతే
వేడి చేసిన గసగసాలు మూట గట్టి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే నిద్ర వస్తుంది.

దాల్చిన చెక్క తో ఆయుర్వేదం

అజీర్ణ రోగము
రోజు బోజనానికి ముందు 2 చిటికలు దాల్చినచెక్క పొడి ,2 చిటికలు శోంటి పొడి ,4 చిటికలు యాలక గింజల పొడి ,కొంచెం మంచి నీళ్ళలో కలిపి తాగుతూ వుంటే అజీర్ణం ,ఆసనం లోని తెపులు తగ్గి పోతాయి.
రక్త విరేచనములు
దాల్చినచెక్క రసములో ,కొంచెం యాలక గింజల పొడి కలిపి సేవిస్తే రక్త విరేచనాలు ,రక్త వాంతులు కట్టుకున్టై .
కఫా జ్వరము
దాల్చిన చెక్క చూర్ణము 3gm ,లవంగా చూర్ణము 2 చిటికలు , శోంటి చూర్ణము 3 చిటికెలు వీటిని ఒక లీటర్ నీటిలో వేసి అరగంట సేపు మరగబెట్టి తరువాత వడపోసి చల్లార్చి 3 గంటలకు ఒకసారి 50gm కషాయాన్ని తాగిస్తూ వుంటే ఊపిరితిత్తులలో కఫము హరించి కఫా జ్వరము హరించి పోతుంది.
కడుపు నొప్పి
దాల్చిన అరకు తెచుకుని అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగుతో వుంటే కడుపు నొప్పి ,అజీర్ణం ,దగ్గు, ఒగర్పు ,తగ్గుతాయి.ఇంకా ఈ అరకు ఉపయోగించడం వల్ల అత్సార విరేచనాలు ,నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
తలనొప్పి
దాల్చిన చెక్కను నీటితో సాది ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధించిన తలనొప్పి తగ్గుతాయి.
కొండ నాలుకకు
దాల్చిన చెక్కను నీటితో రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని దూది పుల్లకు అది కొండ నాలుకకు రోజు 3 పూటలా అంటిస్తూ వుంటే 2 లేక 3 రోజుల్లో వాలి పోయిన కొండనాలుక యదాస్థానానికి చేరి దగ్గు తగ్గుతుంది.
లింగ బలానికి
ఉదయమే పండ్లు తోమక ముందు కొంచెం దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని అరచేతిలో ఉమ్మి వేసుకుని దాన్ని లింగానికి(ముందు బాగం వదలి)లేపనంచేస్తూ వుంటే లింగ బలహీనత తగ్గిపోయి ,మంచి ఉద్దాపన శక్తి కలుగుతుంది.
తేలు కాటుకు
దాల్చినచెక్క తైలం 2 చుక్కలు దూదితో తడిపి తేలు కుట్టిన చోట పైన వేసి గుడ్డతో కడితే తేలు విషం వెంటనే దిగిపోయి బాధ తగ్గిపోతుంది.
కడుపులో క్రిములకు
రాత్రి నిద్ర పోయేముందు 2gm దాల్చినచెక్క చూర్నమును నీళ్ళతో కలుపుకుని తాగుతూ వుంటే కడుపు నొప్పి తగ్గటమే కాకుండా ప్రేగుల్లో వుండే క్రిములు కూడా హరించి పోతాయి.
మతిమరుపు
రోజు ఉదయం పూట 2gm దాల్చిన చెక్క నమిలి తింటూ వుంటే క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అనపకాయ(సొరకాయ) తో ఆయుర్వేదం

వీర్య స్థంబనకు
సొరకాయ ముక్కలను ఆవు నేతిలో పరిమితంగా తింటూ వుంటే శీగ్ర స్కలన సమస్య తగ్గి పోయి రతిలో ఎక్కువ సేపు వీర్యం నిలుస్తుంది.
మూత్ర బిగింపునకు
బాగా పండిన అనపకాయ తీగను సమూలముగా తీసుకుని కాల్చి బస్మము చేసి ,ఆ బస్మాన్ని నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరి పోయే వరకు మరిగించి అడుగున మిగిలిన దాని క్షారం తీసి నిలువ వుంచుకోవాలి. మూత్రం బాదిన్చినపుడు ,లేదా బొట్లు బొట్లుగా పడి బాదిన్చినపుడు ఈ క్షారం 3gm మోతాదుగా ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే వెంటనే మూత్ర బిగింపు హరిన్చిపోయి మూత్రం ధారాళంగా వెలువడుతుంది.
స్త్రీల ప్రదర రోగము
అనబకాయ ముక్కలను యండ బెట్టి దంచి పొడి చేసి నిలువ వుంచుకోవాలి.ఈ చూర్ణము అర చెంచా నుంచి ఒక చెంచా మోతాదుగా బియ్యం కడిగిన నీటితో గాని లేక తేనెతో గాని కలిపి 2 పూటలా తాగుతూ వుంటే స్త్రీల బట్టంటు రోగాలు తగ్గిపోతాయి.
వేసవి పగుళ్ళు
అనబ కాయ లోని పప్పును మెత్తగా నూరి పగుళ్ళ మీద లేపనం చేస్తూ వుంటే వేసవి పగుళ్ళు హరించి పోతాయి.
స్త్రీల రక్తస్రావము
అనబ కాయ మీద బెరడు ,తెల్ల బియ్యం కలిపి నీటితో మెత్తగా నూరి మూత్రద్వారము వద్ద లేపనము చేస్తూ వుంటే స్త్రీల అతి రక్తం కట్టుకుంటుంది.

అందమునకు ఆయుర్వేదము

నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు
కరక్కాయ ,తానికాయ ,ఉసిరికాయ ఈ మూడింటి బెరడు ,నీలి ఆకు ,లోహా చూర్ణము వీటిని సమబాగాలుగా గుంటగలగర నిజరసము జీలకర్ర రసము గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రము తలకు రాసుకుని దట్టముగా లేపనం చేసి 2,3 గంటల తరువాత కుంకుడు శికకాయలతో తలస్నానము చేసిన తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గి పోతాయి.

శరీరము బిగువుగా ఉండుటకు
మేడి పాలు ,మర్రి పాలు నువ్వుల నూనె తో కలిపి కాచి శేరీరానికి మర్దన చేసుకోవాలి.

వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.

అతి బరువు
తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.

పులిపిర్లు తగ్గుటకు
ఉత్తరేని ఆకు ,హరిచంధనమును నువ్వుల నూనె తో కలిపి మెత్తగా నూరి పులిపిర్ల పై లేపనం చేయవలెను.

అధిక మాంసం తగ్గుటకు
ఆవనూనెతో మర్దనా చేస్తే అధిక మాంసం తగ్గుతుంది(ex:మోకాలి క్రింద బాగాన..)

జుట్టు తిరుగుటకు
రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదము రాసి జుట్టును పక్కకు దువ్వాలి ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును.కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి షాంపూ ,సబ్బులు వాడకూడదు.

చుండ్రు
90 వేపాకులు ,9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి తలకు ఒంటికి పట్టించుకవాలి సరిపోక పోతే మరికొంత కలుపుకోవచు.ఆరిపోగానే కుంకుడు కాయ రసం తో స్నానం చేయవలెను.వేపాకులు మిరియాల సంక్య కరెక్ట్ గా వుండాలి.

నల్ల మచ్చలు పోవుటకు
ఆముదపు గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి ,లోపలి పప్పులో 12gm శొంటి పొడి కలిపి మెత్తగా నూరి ,కుంకుడు గిన్జలంత టాబ్లెట్స్ చేసి ,నిలువ ఉంచుకుని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్ని నామరూపాల్లేకుండా పొతాయ్.

మొటిమలు
[1].సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము ,పెసర పిండి ,హారతి కర్పూరము ఈ 3 సమబాగాలుగా కలిపి ఈ చూర్ణముతో ముకానికి నలుగు పెట్టుకుంటూ వుంటే ,ముకం మీద మొటిమలు ,మచ్చలు హరిన్చిపోతాయ్.

[2].సుగంధపాల వేళ్ళ చూర్ణము వస చూర్ణము ధనియాల చూర్ణము ఈ మూడింటిని సమ బాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముకానికి రాస్తూ వుంటే మొటిమలు మచ్చలు హరించి పొతాయ్.

తల లోని పేలు
సుగంధ పాల వేళ్ళను గో మూత్రములో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ వుంటే తల లోని పేలు హరించి పొతాయ్.

వళ్ళు తగ్గటానికి
వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ వుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.

బెల్లం , ఉప్పు తో ఆయుర్వేదం

ఏ బెల్లం మంచిది
కొత్త బెల్లం ఏ విధంగా మంచిది కాదు.దాన్ని తినటం వల్ల కడుపులో పురుగులు పుట్టుకోస్తై .మలబధకం కలుగ చేస్తుంది.ఎక్కువ మూత్రం విసర్జిమ్పజేస్తుంది.శ్వాసకోశ వ్యాధులను కూడా కల్గిస్తుంది.
పాత బెల్లం అంటే కనీసం ఒక సంవత్సరం పాటు నిలువ వున్న బెల్లం ఎంతో ఉతమమైనది.దానిని వాడటం వల్ల సర్వ రోగాలు తాపాలు జ్వరాలు హరించి పోతాయి.నోటికి రుచి పెంచి జీర్ణ శక్తిని కలిగిస్తుంది.పండు రోగం ప్రమేహా రోగాలలో బెల్లం అమోగంగా పనిచేస్తుంది.
వాంతులు
బెల్లము జీలకర్ర సమంగా కలిపి దంచి ఉసిరికాయంత ఉండలు చేసి రోజూ 4,5 సార్లు ఒక్కొక్క ఉండ తింటూ వుంటే వాంతులు కట్టుకుంటై.
తెలు కాటుకు
బెల్లం గంజాయి ఆకు కలిపి నీలతో నూరి ఆ ముద్దను తెలు కుట్టిన చోట పట్టిస్తే విషం పైకి ఎక్కకుండా ఆగిపోయి బాధ కొద్ది సేపట్లోనే తగ్గిపోతుంది.
ఎలుక విషానికి
బెల్లం ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు కలిపి మెత్తగా నూరి చేతి గోళ్ళకు లేపనం చేస్తే ఎలుక విషం విరిగి పోతుంది(పై పూతకు మాత్రమే).
నీళ్ళ విరేచానములకు
బెల్లం ఆవాలు సమబాగాలుగా తీసుకుని మేతగా నూరి ,బట్టాని గిన్జలంత మాత్రలు చేసి ,పూటకు ఒక మాత్ర చొప్పున మంచి నీళ్ళతో 3 పూటలా వేసుకుంటూ వుంటే నెల్ల విరేచనాలు తగ్గిపోతాయి.
అల్సర్
పాత బెల్లం ,అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరికాయంత ముద్ద కొద్ది కొద్దిగా తింటూ ఉంటే అల్సర్ తగ్గుతుంది.
అందమైన ఆరోగ్యం
ఆవు పెరుగులో మంచి పాత బెల్లం కలుపుకుని రోజు తింటూవుంటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
విషమ జ్వరాలకు
బెల్లం 20gm లు తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని ,వాము చూర్ణం గాని ,కొంచెం దోరగా వేయిన్చి కలిపి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి.
తలనొప్పికి
బెల్లము ,శొంటి సమంగా కలిపి దంచి ఆ ముద్దను మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గిపోతుంది .
పార్శ్వపు తలనొప్పి
పాత బెల్లం 24gm ,కర్పూరం 2gm కలిపి మెత్తగా నూరి ప్రతి రోజు ఉదయం పూట ఒక మోతాదుగా తింటూ వుంటే పార్శ్వపు తల నొప్పి తగ్గి పోతుంది.
బోదకాలు
పాతబెల్లం ,మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm ,మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని 2 పూటల తాగుతూ వుంటే క్రమంగా బోదకాలు ,కుష్టు ,అతి దాహము తగ్గిపోతాయి.
కీళ్ళ నొప్పులకు
బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము ,ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు మెడిమల నొప్పులు తగ్గిపోతాయి.
అన్ని రకాల ముక్కు రోగాలు
బెల్లం 280gm ,శొంటి 30gm ,పిప్పళ్ళు 30 gm , యాలకులు 30gm తీసుకుని అన్ని కలిపి దంచి పూటకు చిన్న ఉసిరికాయలంత మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అన్ని రకాల ముక్కు రోగాలు తప్పకుండా పోతాయి.
వాత సంబంధ గొంతు బొంగురు
బెల్లము ,నెయ్యి సమంగా కలిపి 2 పూటలా కొద్ది కొద్దిగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి గొంతు బాగుపడుతుంది.
బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5 gm మోతాదుగా తింటూ వుంటే గొంతుబొంగురు తగ్గుతుంది.
అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడుతుంటే
బెల్లం అల్లం సమంగా కలిపి నూరి పూటకు 5 నుండి 10gm మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడటం తగ్గిపోతుంది.
ధద్దుర్లకు
బెల్లం ,వాము సమబాగాలుగా కలిపి దంచి ,రేగి పండ్లనత టాబ్లెట్స్ చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 లేక 3 పూటల ఆవ నూనెలో ముంచుకుని తింటూ వుంటే దద్దుర్లు హరిన్చిపోతై.

కనబడని దెబ్బల నొప్పులకు
పాత బెల్లం చిక్కగా పాకం కాచి అందులో తగినంత నెయ్యి కలిపి పూటకు 100gm చొప్పున 2 పూటల సేవిస్తో వుంటే కవుకు దెబ్బలు నొప్పులు హరించి పోతాయి.
పుండ్లు-వ్రాణాలకు
పాత బెల్లం ,పొంగించిన వేలిగారం ఈ రెండు సమంగా కలిపి నూరి పుండ్ల మీద ,వ్రణాల మీద లేపనం చేస్తూ ఉంటే తగ్గిపోతాయి.
మూత్రం బిగిస్తే
గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పాత కలిపి తాగుతూ వుంటే మూత్రబిగింపు తగ్గిపోతుంది.బెల్లం ,జీలకర్ర కలిపి తింటూవున్న తగ్గిపోతుంది.


ఉప్పు

సాధారణ పాముకాటుకు
బురద పాము లేదా తుట్టె పురుగు లేదా మామూలు పాములు కరచినప్పుడు ,కరచిన చోట కత్తితో కొద్దిగా గీరి రక్తము పిండి ఉప్పు సున్నము కలిపి నూరిన ముద్దను కాటుపై మర్దించిన యెడల విషము దిగును.
కలరా వ్యాధికి
ఉప్పు ,మిరియాలు ,జిల్లేడు పూవులు సమబాగాలు తీసుకుని కలిపి మెత్తగా నూరి బట్టని గిన్జలంత టాబ్లెట్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 మాత్రలు వేసుకుంటే కలరా హరించిపోతుంది.
దెబ్బల వాపులకు
ఉప్పు ,వెల్లుల్లి పాయలు సమబాగంగా తీసుకుని మెత్తగా దంచి ఆ ముద్దను వాపు మీద వేసి కడుతూ వుంటే 2 కట్ల లోనే వాపు తగ్గి పోతుంది.
అధిక పైత్యమునకు
ఉప్పు ,చింతపండు ,మిరియాలు ,శీకాయ చెట్టు చిగురాకులు కలిపి వచ్చి పచడిలాగా నూరి ,ఆ పచ్చడిని అన్నంలో కలుపుకుని తింటూ ఉంటె అదికపైత్యం హరించిపోతుంది.
ఆకలి-అజీర్ణం
ఉప్పు ,శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద్దలో 5gm పొడి కలిపి తింటూ వుంటే నాలుక ,గొంతు శుబ్రమై కఫము తగ్గి ,ఆకలి పెరిగి ,ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
కడుపు నొప్పి
ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది.
చలి జ్వరం
ఉప్పు ,మిరియాలు ,పిప్పిన్టాకు(మార్కొన్డాకు) ఈ 3 సమంగా కలిపి కచాపచాగా నలగగొట్టి గుడ్డలో వేసి మూటగట్టి దాని వాసన పదే పదే చూస్తూ వుంటే చలి జ్వరం రాకుండా వుంటుంది.
చిన్న పిల్లల కడుపు నొప్పి
నల్ల ఉప్పు 10gm ,నిప్పుల మీద వేసి పొంగించిన వెలి గారము 5gm ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి 2 పూటల పూటకు చిటికెడు మోతాదుగా నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల కడుపునొప్పి తగ్గుతుంది.
తల నొప్పులకు
తినే ఉప్పు ,పాతిక బెల్లం ఈ రెండూ సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని 2 పూటల 2 gm పొడిని గోరువేచని నీటిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గి పోతాయి.
పిల్లల ఉదర వ్యాధులు
నల్ల ఉప్పు సోంపు గింజలు సమంగా తీసుకుని మెత్తగా దంచి నిలవచేసుకుని ,రోజు 2 పూటలా ఒక గ్రాము పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
స్త్రీల హిస్టీరియా
నల్ల ఉప్పు 10 gm ,తినే ఉప్పు 10gm ,ఇంగువ 3gm , సైంధవ లవణం 10gm , నూరే కారం 10 gm ,పిప్పళ్ళు 10gm ,శొంటి 10gm , ఆవాలు 10gm ,ఇవన్ని కలిపి చూర్ణం చేసి కొద్దిగా నిమ్మ పండ్ల రసం తో మర్దించి నిలువ చేసుకోవాలి .రోజు 2 పూటల పాటకు 3gm మోతాదుగా వేడి నీళ్ళతో సేవిస్తూ వుంటే స్త్రీ ల హిస్టీరియా నశించి పోతుంది.
చెవిలో పురుగు దూరితే
చెవిలో పురుగు దూరితే ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసము 4 చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాలలో పురుగు బయటకు వస్తుంది.
ఫిట్స్ వచ్చినపుడు
ఉప్పును నీటిలో వేసి కరిగించి వడపోసి ఆ ఉప్పు నీటిని 3 ,4 చుక్కలు ముక్కులో వేస్తే ఫిట్స్ వల్ల అపస్మారము వల్ల తెలివి తప్పిన వారు వెంటనే కోలుకుంటారు.
వాపులకు-నొప్పులకు
ఉప్పును వేయించి మూట గట్టి దానితో కాపడం పెడుతూ వుంటే వాపులు ,నొప్పులు వెంటనే తగ్గుతాయి.కడుపు నొప్పికి ,గుండె నొప్పికి ఇదే విధంగా కాపడం పెట్టడం ద్వారా నొప్పులు నెమ్మదిస్తై.

తాంబూలం(పాన్,కిల్లి) రహస్యాలు

ఆహారము సేవించిన తరువాత తాంబూలము సేవించుట మంచిది ,ఆరోగ్యకరమైనది.తాంబూలము సేవించిన మనము తీసుకున్న ఆహారమునందలి విష పదార్ధములను నిర్వీర్యము చేయును.
జీర్ణ శక్తిని అబివృద్ధి పరచును.తాంబూలము సేవించుట వలన జీర్ణ శక్తి అబివృద్ధి పరచును ,ధన్తపుష్టి కలుగును. ఎప్పటికి చెడుపు కలుగనీయదు.తాంబూలము నోటికి చురుకుదనము ,సువాసనను ఇచ్చును ,ముకమునకు కాంతి కల్గును . స్వరాపెటికా ,నాలిక ,దంతములు ,వీటియందు మలినము పోగొట్టును .అధికముగా నోటి యందు ఉమ్ము రావుటను తగ్గించును.
హృదయమునకు మేలు చేయును.ఉష్ణమును కలుగ చేయును.కారము చేదు ఉప్పు వగరు రసములను కలిగి యుండుటచే మలబధకమును పోగొట్టును.
సంబోగామునందు ఆసక్తి కల్గించును.కొన్ని సమయములందు పిత్తమును వృద్ధి చేయును. ఆరోగ్యజీవేతము ,ధరానా శక్తి , జ్ఞాపక శక్తి ,బుద్ధి ఆకలి కల్గించును .

ప్రాచీన నియమాలు:

[1].సూర్యునికి ఎదురుగా నిలబడి పండ్లు తోముకోకూడదు.

[2].పురుషులు దీపమును ఆర్పకూడదు.ఒక దీపముతో మరొక దీపమును వెలిగించకూడదు.

[3].వ్రతము చేయువారు మంచము మీద నిద్రించ కూడదు.శృంగారంలో పాల్గొనకూడదు.ఒక పూట పలహారము మాత్రమే బుజిమ్పవలెను.తాను ఆహారము బుజించే ముందు పేదలకు గానీ ,బిక్షువులకు గాని కడుపు నింపవలెను.


[4].అమావాస్య నాడు చెట్టు కొమ్మలను గని ,ఆకులను గని తుంచుట బ్రహ్మ హత్యతో సామానమయిన మహాపాపము.


[5].బోజన సమయంలో అన్నదేవత నోటి యందు వుంటుంది కాబట్టి ఆహారము మీదనే దృష్టి నిలిపి ,మౌనంగా బోజనము మీద గౌరవముతో ప్రీతిగా బుజించాలి .ఆ విధంగా తినే ఆహారం మాత్రమే వంటబట్టి దేహానికి శక్తినిస్తుంది.


[6].గడపను తోక్కకూడదు .గడప మీద నిలబడ కూడదు .గడపకు అటు ఒక కాలు ఇటు ఒక కాలు పెట్టి నిలబడి దానము చేయకూడదు.ఇలా చేసిన యెడల గడప ముందు నివాసముండే లక్ష్మి తొలిగి పోయి ఆ కుటుంబం అప్పులపాలగును.

[7].సూర్యునికన్న ముందు నిద్ర మేల్కొనే వారు సదా ఆరోగ్యం తో వర్ధిల్లుతారు .సూర్యోదయం తరువాత నిద్ర లేచే వారు ఎన్ని ఔషధాలు మింగినా ,అమృతమే తాగిన నిత్య రోగిష్టులవుతారు.

[8].ఎవరైనా తాము చేసే మంచి పనికి దానము చేయమని అడిగినపుడు తాను దానము చేయగలిగిన శక్తి గలవాడైతే మాపురమ్మని రేపు రమ్మని తిప్పుకోకుండా వెంటనే దానము చేయవలెను .ఈ దానం వల్ల అశ్వమేధ యాగా ఫలం సిద్ధిస్తుంది .ఎందుకనగా దానము పొందిన ఆ జీవుని ప్రసంనమే దేవుని ప్రసన్నమునకు కారణమవుతుంది.

[9].వ్రతం చేసే రోజున గానీ ,నోములు నోచె రోజు గాని ,ఏదైనా పవిత్రమైన ధైవకర్యం తలపెట్టిన రోజున గాని తన ముకమును అద్దములో చూసుకొన కూడదు.

[10].ఎవరి ఇంటి యందు 24 గంటలు దేవుని గది లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం కాపురముంటుంది .అంతే కాకుండా పిత్రు దేవతలు పరమానందం చెంది తమ సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు .దీపం నువ్వుల నూనెతో గాని ,ఆవు నెయ్యితో గాని వెలిగించి వుండాలి(కరెంటు బల్బులు దీపంతో సమానం కావు).

[11].మనస్పూర్తిగా చేసిన దానము మాత్రమే మంచి ఫలితమునిచ్చును .కోపముతో గాని ,మొగమాటముతో గాని చేసిన దానము వలన పుణ్యము రాకపోగా పాపము సంక్రమించును.

[12].ఏడుస్తున్న పసిపిల్లలను తల్లి గాని ,తండ్రి గాని కొట్టినచో ఆ ఇరువురు నరకమున కు పోవుదురు.

[13].ఒక కాలుతో మరొక కాలును రుద్దుతూ తోముతూ కళ్ళు కడుక్కొన కూడదు .కింది పళ్ళను పై పళ్ళతో నొక్కి రాపిడి చేయకూడదు.

[14].భోజనం తరువాత వేళ్ళతో పండ్లు తోమకూడదు .పుక్కిలించి మాత్రమే ఊసివేయాలి.

[15].పండ్లతో గోళ్ళు కోరకకూడదు.2 చేతులతో ఒకే సారి నెత్తి గోక్కో కూడదు .

[16].నిద్రపోయే అప్పుడు ముకమును కూడా దుప్పటితో కప్పకూడదు . బోజనము చేసేటప్పుడు నోటితో శబ్దము చేయకూడదు .ఉదయం సాయంత్రం సంధ్యాసమయాల్లో నిద్ర పోకూడదు అంతకు మించి దరిద్రం మరొకటి లేదు.


[17].సంబోగం లో పాల్గోనినప్పుడు ధరించి ఉన్న బట్టలు ,ఉతికిన తరువాత కూడా వాటిని పూజా సమయంలో ధరిమ్పరాదు.


[18].మెదలపైనా ,గోడలపైన మంచం పైనా కూర్చొని చేసే జపము ,ధ్యానము ,నిరుపయోగము .బూమిపైన ధర్బాసనము గాని ,గొంగళి గాని ,పట్టు వస్త్రము గాని ,పులి చర్మము గాని పరచుకుని దానిపైన కూర్చుండి జపము చేయవలెను.

[19].ఆహారము బుజించే సమయంలో చేతిలోకి తీసుకున్న ముద్ద సగం నోటి లోకి పోయి మిగిలిన సగం మల్లి విస్తరలోకి పడకూడదు.

[20].బోజనానికి ముందుగానే ఎక్కువ నీరు తాగితే అజీర్ణం కలుగుతుంది.

[21].గణ పదార్దములు తినేటప్పుడు మధ్య మధ్య లో కొంచెం మంచి నీరు తాగాలి.

[22].మజ్జిగ అన్నం తిన్న తరువాత ఎక్కువ మంచి నీళ్ళు తాగితే కఫము పెరుగుతుంది.

[23].కొబ్బరి తిని గాని ,అరటి పండు తిని గాని ,తాంబూలం వేసుకుని గాని వెంటనే మంచి నీళ్ళు తాగకూడదు.

[24].భోజనం చేసేటపుడు జపము చేసేటపుడు శిరస్సును ముట్టుకోకూడదు.

[25].గారిక పోచాలతో దుర్గా మాతను ,మొగలి పూవులతో శివుని ,అక్షతలతో సాలాగ్రమమును ,తులసి తో వినాయకుని పొరపాటున కూడా పూజింపకూడదు.

[26].తులసి ఆకు ,పండ్లు ,పూలు ,పుస్తకము ,గారిక పోచలు ,ధర్బముడి ,పండితుల వ్రుష్టము ,శ్రీకుచములు ,రుద్రాక్షలు ,తులసి పూసలు వీటిని బూమి మోయలేదు.కాబట్టి వీటిని ఎప్పుడు బూమి మీద పెట్ట కూడదు.అనగా ఇవి నెలకు తగలకూడదు.


[27].చెక్క పీట మీద కూర్చుని చేసే జపం వల్ల దరిద్రం కలుగుతుంది.మేడి కర్ర పీత మీద కూర్చుని జపం చేస్తే సిద్ధిస్తుంది.

[28].వేప పుల్ల గాని మరే పుల్లనైన తోలు తీయకుండానే దంతధావనం చేయాలి.


[29].వెలగ కాయ పగటి పూట తిన కూడదు.వెలగ చెట్టు నీడ కూడా పగటి పూట పనికి రాదు.

[30].రావి చెట్టు నీడను రాత్రి పూట తొక్క కూడదు .రావి చెట్టును శనివారము తప్ప మిగిలిన రోజులలో ముట్టరాదు .తాటి చెట్టు నీడ ఎపుడు తొక్క కూడదు.

Thursday, January 22, 2009

సంపూర్ణ పురుష సౌందర్య శుభా అశుబ లక్షణాలు

శివుడు పార్వతితో చెప్పిన సంపూర్ణ పురుష సౌందర్య శుభాశుబ లక్షణాలు




కైలాస శికరం మీద పార్వతీ పరమేశ్వరులు సుకాసీనులై వుండగా పరమేశ్వరుడు పరమానందంగా మందహాస వదనారవిన్దుడై ప్రసన్నుడిగా వున్న సమయంలో ,పార్వతీ దేవి ఆయనతో "నాదా! గతములో ఒక సారి తమను ప్రశ్నిచినపుడు కలియుగంలోని స్త్రీ సంపూర్ణ శుబాశుబ లక్షణాలను వివరించవలసిందిగ కోరుతున్నాను ,అని ప్రేమగా అడుగగా పరమేశ్వరుడు ప్రసన్నమానసుడై ఈ క్రింది విధంగా చెప్పటం మొదలు పెట్టాడు.
దేవి! సంపూర్ణ పురుషుడు అనబడువాడు ,ముందుగా ధర్మార్ధ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్ధాల మీద తగిన అవగాహనము ,వాటిని సాధించటంలో విశ్వాసాన్ని కలిగి వుండాలి.
కండ్లలో కనుపాప తప్ప మిగిలిన తెల్ల గుడ్డు ,దంతాలు మిక్కిలి తెలుపు రంగులో వుండాలి.
గంబీరమైన ,ఇంపైన కరునారణతరంగితమైన కంట స్వరం కలిగి వుండాలి .
కామ క్రోధ లోబ మోహ మధ మాత్సార్యాలనే అరిషద్వార్గాలకు అతీతుడిగా ,ఓర్పు ,నేర్పు ,దయ ,మానవత్వము ,ఆహిమ్సతత్పరతా ,సమతాబావము ,స్వీయ సంస్కృతి పట్ల ఆరాధన వీటికి ప్రతిరూపుడిగా వుండి తీరాలి.
ధైర్యము ,సాహసము ,నిజాయితి మూర్తి బావించి వుండాలి .
అన్యాయాన్ని ఎదిరించే పరాక్రమంతోను ,అగ్నాన్ని తరిమి కొట్టే విజ్ఞానం తోను ,దారిద్రాన్ని రూపుమాపే సిరిసంపదతోనూ ,సాహసవంతుడై ,జ్ఞానవంతుడై ,ధనవంతుడై ,కీర్తిని సంపాదించి ఉండాలి.
ఉదరము మీద కంటము మీద అడ్డంగా మూడు గీతలు కలిగి ,దేవతలకు ,గురువులకు ,పేదలకు వినమ్రుడై వుండాలి.
రొమ్ము ,నుదురు ,ముకము విశాలముగా వుండి ,లటాలము పైన అరచేతులలోను 4 రేకలు ఉండవలెను.
చేతివేళ్లు ,కాళ్ళ వెళ్ళు ,హృదయము , వీపు ,కంటి ప్రదేశము ,బుజాలు ,మోకాళ్ళు ,పిక్కలు ,తొడలు ,ఇవన్ని వాటి వాటి స్థానానికి తగిన ప్రమాణాలతో వుండి దేహ ప్రమాణము 96 అంగుళముల పొడవు కలిగి వుండాలి.
మీసములు ,కనుపాపలు ,కనుబొమ్మలు ,తల వెంట్రుకలు ఇవి నల్లగా నిగారిమ్పుగా వుండాలి.
ముక్కు ,నోరు ,చెవులు ,చంకలు ,మర్మస్తానాలు దుర్వాసన లేకుండా సుగంధ యుక్తంగా వుండి శిశ్నము(మర్మాంగము) మెడ పిక్కలు ,ఈ మూడు మరి పొడుగ్గా మరి పొట్టిగా గాని లేకుండా మధ్యమ స్థాయిలో వుండాలి .
శిశ్నము వంకర లేకుండా తిన్నగా వుండాలి .
చర్మము ,వెంట్రుకలు ,నేత్రాలు ,దంతాలు ,గోళ్ళు ,పెదవులు ఇవి మెరుగు కలిగి సన్నగా వుండాలి .నాలుక ,పెదవులు ,దౌడలు ,కన్నులు ,హస్తములు ,పాదములు ,అరచేతులు ,అరికాళ్ళు ,శిస్నాగ్రము ,నోరు ఇవి పద్మాకారముగా ఉండవలెను.
హస్తాలు ,పాదాలు ,మెడ ,చెవులు ,రొమ్ము ,శిరస్సు ,నుదురు ,ఉదరము ,వీపు ఇవి ఉన్నతమైనవి గా విశాలంగా వుండాలి .
నిర్మలమైన దృష్టి ,మధురమైన వాక్కు ,మదపుటేనుగు వంటి నడక కలిగి ఒక్కొక్క రోమ కూపములో ఒక్కొక్క రోమమే కలిగి వుండే పురుషున్ని మహా పుణ్య వంతుడు ,మహా సౌందర్య వంతుడు అంటారు.

సంపూర్ణ స్త్రీ శుభా అశుబ లక్షణాలు

శివుడు పార్వతితో చెప్పిప్న సంపూర్ణ స్త్రీ సౌందర్య శుబాశుబ లక్షణాలు:

స్త్రీ యొక్క సర్వాంగాలు సౌందర్య శోబితాలుగా ఉండాలి.
మదపుటేనుగు వంటి నడక కలిగి ,ఎతైన పిరుదులు కలిగి ,సన్ననైన నడుము కలిగి ,ఒకదానినొకటి ఒరుసుకునే ఎతైన గుండ్రని వక్షోజాలు కలిగి వుండాలి.
ఎక్కువ లావు ,ఎక్కువ సన్నము లేక మధ్యమ స్థాయిలో వుండి ,తల పైన ,మర్మ స్థానాలలో తప్ప మిగిలిన దేహ బాగాలలో అనవసర రోమాలు లేకుండా చర్మమంతా నునుపుగా ,మెరుపుగా ఉండాలి.
సమతలమైన బూమి మీద నడిచేటపుడు అడుగు జాడలు స్పష్టంగా కనిపించే పాదాలు కలిగి వుండి బొటన వేలంత ప్రమాణంగా ప్రధాక్షినాక్రుతి లో సుడి కలిగిన నాబి(బొడ్డు) వుండాలి.
రావి ఆకు ఆకృతి వలె వుండే భాగము(యోని) గల స్త్రీ శుబాంగి అనబడుతుంది.
ఒకదానినొకటి కలుసుకోనని కనుబొమ్మలు కలిగి ,ఇప్ప పువ్వుల వలె నిగాగాలాడే చెక్కిళ్ళు ,శరీరం పైన నరాలు ,రోమాలు కనిపించకుండా వుండాలి .
నక్షత్రములు ,వృక్షములు ,నదులు వీటి పేర్లు లేకుండా ఉండి ,ఎల్లప్పుడు అసూయ ద్వేషాలకు అతీతురాలిగా ,ప్రేమానురాగాలకు ప్రతి రూపిణిగా ,కలహా స్వబావము లేని మృదు బాషినిగా ,ఎల్లప్పుడు చిరునవ్వులతో ఇంటికి వెలుగుగా వుండే స్త్రీలు సంపూర్ణ శుబ లక్షణాలతో కూడిన సౌందర్య రాశులనబడతారు అని మహాదేవుడు స్త్రీ పురుష లక్షణాలను వివరించారు.

పార్వతి దేవి తన సంశయము ఇంకా తీరనట్లుగా "స్వామి! ప్రతి స్త్రీ ని ప్రతి పురుషుని మీరు అదేవిధంగా సృష్టించవచ్చు కదా! ఎందుకు ఆ విధంగా జరుగుట లేదు" అని ప్రశ్నించింది.అందుకు పరమేశ్వరుడు "దేవి మన సృష్టిలో ఎటువంటి లోపము లేదు మనము అందరిని ఒకే విధంగా సృష్టిస్తున్నాము. కాని మానవులే వారి వారి స్వయంక్రుత కర్మలతో అదుపు లేని ,విహార ,వ్యవహార నియమాలతో ,అంతు లేని కామ క్రోధ లోబ మోహ మధ మాత్సర్యాలతో ,తమ శారీరక సౌందర్యాన్ని తమ మానసిక ఔన్నత్యాన్ని పోగొట్టుకుని వికృత స్వరూపులై వింత వింత రోగాల బారినపడి బలైపోతున్నారు." అన్నారు.అందుకు పార్వతీ దేవి నాదా! మరి మన బిడ్డలు రక్షిమ్పబడే మార్గమే లేదా అని అడుగగా " ఎందుకు లేదు దేవి వారి తప్పులను వారే సరిదిద్దుకుని ,వారి సంస్కృతిని వారు ఆచరించి ,సాటి మానవులను ఆదరించే మానవతా హృదయాన్ని పెంచుకున్నప్పుడు సౌందర్య స్వరూపులవుతారు " అని వివరించినారు.

ఆచరించండి

గంగి గోవును కాపాడండి


గంగి గోవు అన్ని రకాల ఔషధ మొక్కలు మాత్రమే తింటుంది .అందుకే గంగి గోవు ఓంకార స్వరూపమై సర్వదేవతా స్వరూపమయి ప్రతి పూజకు ఆవు ప్రధానమయినది .పంచామ్రుతములో ఆవు పాలు ,ఆవు పెరుగు ,ఆవు నెయ్యి ,అరటి ,తేనె లేనిదే చేయకూడదు .ఆవు పేడ ,ఆవు పంచితం తోనే ఎవరైనా ఇంటిలో శుచి ,శుబ్రం చేయుచున్నారు .రక్షించండి - మూపురం గల గంగి గోవులను పారద్రోలి ఆవుల్ని ,సంకరాలని ,వాటి వీర్యాలని ,మన ప్రాచీన శాస్త్రాలు మేనరికల్లో పిల్లలు సరిగా పుట్టారని చెబుతూనే "మన ప్రాచీన మూపురంగుల గంగి గోవు పాల పెరుగును తల్లులకు 3 వ నెల నుండి 9 వ నెల వరకు రోజూ తినిపిస్తే మన కన్న అందమైన ,బలమైన ,ఆరోగ్య మైయిన ,సంపూర్ణ సౌష్టవం గల పిల్లలు సందేహమే లేకుండా కల్గుతారని వరమిచ్చినాయి .ఆవు చుట్టూ రోజు తిరిగే వారికి ఆరోగ్యం బాగా వుంటుంది.హరప్పా ,మొహంజొదారో వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి ఎద్దులు సైతం సంకరం వల్ల మాయమైనవి.జాతి ఎద్దులు 6 అడుగుల ఎత్తులో బలంగా ,అందంగా ,ఆరోగ్యంగా ,గంబీరంగా ఉంటాయి .ఆవులు 20 - 30 లీటర్ ల పాలామ్రుతనిస్థాయి.కాని సంకరాలు 3 అడుగులతో ,రోగాలతో ,వికృతంగా బలహీనంగా బితర చూపులతో తిరుగుతుంటాయి.గమనించండి సంకర ఎద్దులు మన ఎద్దులు 4 వ వంతు బరువు లాగడానికి కూడా కష్టపడుతుంటాయి.


గంటె అయిన చాలు గంగి గోవు పాలు - కుండ అయిన నేమి కరిమి గాడిద పాలు.


ప్రకృతిని పూజించండి .వెధయుక్త ,జ్ఞాన ,శాస్త్రీయమైన ,మనప్రాచీన సంప్రదాయ మన కన్న తల్లి వంటిది నేడున్న విద్యుతు ,పరిశ్రమలు ,కంప్యూటర్స్ మన బిడ్డల వంటివి.బిడ్డలున్నారని కన్న తల్లిదండ్రులను వదిలేస్తామ.


ప్రేమ:

మంచితనము లేదా గొప్పతనమే ప్రేమ తన వలన ఇతరులు కూడా ఉండాలి అని జాగ్రతగా ప్రవర్తిన్చేదే ప్రేమ.

అంతేగాని సినిమాల్లో చూపించే సెక్స్ అల్లరి ,గొడవ చంపుకోవడము ,నీచగుణం ఇది ప్రేమ కాదు.

బుద్ధుడు దశావతారాల్లో తోమ్మిదవని చాటండి .

నేడున్న బలరాముడు ఆదిశేషుడని తెలుసుకోండి.

కల్కి 3,5 లక్షల సంవత్సరాల తరువాత గాని అవతరించాడు.

కలియుగము 4,32,000 సంవత్సరాలో నేడు 5102 మాత్రమే .

కావున మన సంప్రదాయాలను కాపాడుకుందాము.


పాలు తాగావదనే ప్రచారం నమ్మకండి :ఇటీవల కాలంలో కొంత మంది ఆరోగ్య శిక్షణ శిబిరాల పేరుతో ప్రచారం నిర్వహిస్తూ ముక్యంగా పాలు తాగవద్దని ప్రజలకు నూరి పోస్తున్నారు .సహజ జీవన విధానానికి బిన్నంగా ఏదో ఒక ప్రత్యేక నినాదం ఉంటేనే ప్రజలను ఆకర్షించగాలమనే వ్యర్ధ ప్రచారమే వీరిలో కనిపిస్తుంది.ఇప్పటికే ఇంగ్లీష్ వైద్యుల పుణ్యమా అని నూనె ,నెయ్యి తీపి పదార్దములు ,వెన్న మొదలైన శక్తి వంతమైన పదార్ధాల వాడుక తగ్గి పోయి ప్రజలు చైతన్య హీనులవుతున్న ఈ దశలో మిగిలివున్న ఆ ఒక్క పాలు కూడా తాగ వద్దని ప్రచారం చేయటం ప్రజలను ఎందుకు పనికి రాని దద్దమ్మలుగా చవటలుగా సారహీనులుగా చేయటం జాతికి శ్రేయస్సు కాదు.

[1].పిల్లలు పుట్టిన తరువాత 6 మాసాల్లోను ,ఆవు దూడలు 6 వారాల్లోనూ ,పంది పిల్లలు 18 రోజుల్లో ,కుందేలు పిల్లలు వరం రోజుల్లోనూ పుట్టినప్పటి కన్నా రెట్టింపు బరువును పొంద కలుగుతున్నాయి.ఈ పెరుగుదల కేవలం పాల వల్లనే అని మర్చి పోకండి.బారతీయ చతుర్వేదాలు ,ఆయుర్వేదము పాలను కొనియాడాయి.ఆధునిక శాస్త్ర వేత్తలు కూడా పాలలో ఉన్నన్ని జీవనీయ పదార్ధాలు ఏ ఇతర పదార్ధాలలో లేవని గంటాపధంగా నిర్ధారించారు.

[2].పాలు అమృత తూల్యమైన ద్రవం .ఈ ద్రవం లో 101 రకాల జీవనీయ పదార్ధ విశేషాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేతలు ప్రయోగాత్మకంగా నిర్ధారించారు.

[3].పాలలోని 3 రకాల ప్రోటీనులలో 19 ఎమినో ఆసిడ్ లు ,11 రకాల కొవ్వు పదార్ధాలు ,6 రకాల విటమిన్లు ,8 రకాల ఎంజైమ్ లు ,25 రకాల కనిజాలు ,5 రకాల బాస్వరం మిశ్రమ పదార్ధాలు ,14 రకాల నత్రజని సంబంధ పదార్ధాలు ,చెక్కర మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు.

[4].శరీరంలో ప్రతి చిన్న బాగానికి అవసరమైన కాల్షియం ,బాస్వరం మొదలైన పదార్ధాలను పాలు సమృద్ధిగా అందిస్తాయి.

[5].పాలలో ప్రోటీన్లు ,కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,కనిజ లవనాలలో బాస్వరం ,పొటాషియం,సోడియం ,క్లోరిన్ ,మెగ్నీషియం ,సల్ఫర్ మొదలైనవి పేర్కొనదగినవి.

[6].పాలలో A,B,C విటమిన్లు కొంచెం D విటమిన్ ఉన్నాయ్ .పాలల్లో ఉండే చెక్కర ఇతర పదార్ధాలలో ఉండే చేక్కరలా తొందరగా పులిసిపోదు.

కనుక పాలు తాగావద్దనే బూటకపు ప్రచారం నమ్మకుండా మంచి పాలు సేవిస్తూ మంచి ఆరోగ్యం పొందండి.

యుగాలు - రహస్యాలు

శ్రీ నారద పురాణంలో సనక మహర్షి చెప్పిన యుగాల రహస్యాలు - యుగాల ధర్మాలు





నారదుడు సనక మహర్షిని యుగ లక్షణాల గురిచి వివరంగా చెప్పమని అడుగగా ఆయన ఈ విధంగా చెప్ప సాగాడు.

బూలోకములో ఒకప్పుడు ధర్మమూ వృద్ధి చెందుట ,మరొకప్పుడు ధర్మమూ క్షీణించుట జరుగును ఈ తమ స్వబావాలను బట్టి కాలాన్ని కృతయుగము ,త్రేతాయుగము ,ద్వాపర యుగము ,కలియుగము అని విబజించుట జరిగినది.


కృతయుగం లక్షణాలు:


కృతయుగంలో ప్రజలందరూ ధైవంశ సంబూతులుగా ,సాక్షాత్ దైవ స్వరూపులుగా వుంటారు.ఆ యుగంలో దేవతలు ,దానవులు ,గంధర్వులు ,యక్షులు ,రాక్షషులు ,పన్నగులు అనే బేధం ఉండదు.
అందరు సమానమైన దృష్టి కలవారుగా ,ధర్మ పరాయనులుగా ఉంటారు.
ఈ కాలంలో అమ్ముట కొనుట అనేదే ఉండదు .
ప్రజల్లో కామ క్రోధ మోహ లోబ మధ మాత్సర్యాలు మచ్చుకు కూడా కాన రావు.
అందరు ధర్మ సంపన్నులుగా ,తపస్సంపంనులుగా , అసూయరహితులుగా ,సర్వ శస్త్ర పరిజ్ఞానము కలవారుగా ఉంటారు.
ఈ సదాచార పారాయనత వల్ల వారికి కోరుకోకుండానే అన్ని ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఈ యుగంలో సృష్టి కర్త అయిన శ్రీ మన్నారాయణుడు ,ష్కల వర్నుడిగా ,సునిర్మలుడిగా ఉంటారు .
ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంటుంది.


త్రేతా యుగము:

ఇక త్రేతా యుగంలో ధర్మం పాండు వర్ణాన్ని పొంది వుంటుంది
శ్రీ హరి రక్త వర్ణంగా మారిపోతాడు.
ప్రజల్లో కష్టాలు మొదలవుతాయి.
అయినా ప్రజలందరు క్రియా యోగ ధ్యాన కర్మలు నిర్వహిస్తుంటారు .
ఈ కాలంలో ధర్మం 3 పాదాలతో నడుస్తూ ఉంటుంది.


ద్వాపర యుగం:

ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలతో నడుస్తుంది .అంటే ధర్మమూ ,అధర్మము చేరి సమానంగా సంచరిస్తూ ఉంటాయి.
హరి పీత వర్నుడిగా మారతాడు.
ఈ యుగం లోనే వేద విబజన జరుగుతుంది .
బ్రహ్మ జ్ఞానము గల పండితులలో సగం మంది అధర్మ నిరతువులవుతారు ,
అరిశాద్వార్గాలకు లోనై ధర్మ బ్రష్టులవుతారు.
ధర్మ సంపాదన ప్రధాన ధ్యేయంగా మారుతుంది.
ఈ యుగం ప్రబావం వల్ల సగం మంది ప్రజలు రోగాములతో,యుద్ధములతో మరణిస్తారు.
కొందరు ప్రజలు వారి వారి స్వయంక్రుత దుష్కర్మల వల్ల అల్పాయువు కలవారై అకాల మరణం చెంద్తారు.
ధర్మ మార్గమ అనుసరించే వారిని చూసి ధర్మ బ్రష్టులైన వారు అసూయపడుతుంటారు.


కలియుగం

ఈ యుగంలో ధర్మం కేవలం ఒక పాదం తో మాత్రమే నడుస్తుంది. అంటే జనంలో 4 వ వంతు మంది ధర్మ పరులుగా ఉండి మిగిలిన వారంతా అధర్మపరులుగా ఉంటారు.
కనుక ఈ యుగాన్ని తామస యుగము లేక రాక్షస యుగము అని కూడా అంటారు.
అందుకే ఈ యుగంలో శ్రీహరి కృష్ణ వర్ణాన్ని పొందుతాడు.
వెయ్యి మందిలో ఒకడు ధర్మ పరుడిగా వుండి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటాడు .
అందరు అతన్ని అగ్నానుడిగా ,పిచి వాడిగా గేలి చేస్తూ ఉంటారు.
యజ్ఞాలు లేనందు వల్ల పంచ బూతాలు కాలుశ్యమై పోయి ప్రలయాలు ,ఉత్పాతాలు తరచుగా సంబవిస్తున్టై.
అసూయ పరులు ,దేవుని అడ్డం పెట్టుకుని బ్రతికే దంబాచార పారాయనులు ,అల్పాయుష్కులు మితిమీరిపోతారు.
బూమి మీద ఈ కాలంలో సకల ధర్మాలు నశించి పోతాయి.కాబట్టి సర్వపాతక సంకరమైన గోరయుగంగా మారిపోతుంది.

బ్రహ్మ జ్ఞాన పండితులంతా వేదాధ్యాన్ని వదిలేసి ధర్మ బ్రష్టులవుతారు.
కపట వేషాలతో కపట బోధనలతో పైకి గొప్ప ధర్మ నిరతులుగా ప్రజలను వంచించి పబ్బం గడుపుకుంటారు
పండితులు వ్యర్ధమైన అహంకారముతో విర్రవీగుతూ సాటి మానవులను ద్వేషిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతూ పతనమై పోతుంటారు.
ప్రతి మనిషి తనకు తానే అందరికన్నా అధికుడనని గర్వ పడుతూ ,వ్యర్ధ ప్రసంగాలతో ,వితండవాదాలతో కాలాన్ని వృధా చేస్తూ అలపాయుష్కులవుతారు.
పాప కర్మల వల్ల ,అన్యాయ స్వాబావం వల్ల పేదలు బ్రతికి ఉండగానే పిల్లలు మరణిస్తూ ఉంటారు.
ఉత్తములుగా ఉన్నతులుగా ఉండ వలసిన వారు నీచులుగా మారిపోతారు.
ఎన్ని నీచ పనులు చేసినా ధనము ఉన్న వారిని ఉత్తములుగా గుర్తించెదరు.
ప్రజలను కన్న బిడ్డల వలె పాలించా వలసిన పాలకులు ,ధన వ్యామోహ పీడితులై ప్రజల పై అదిక పన్నులు వేసి వారిని పీడించి పిప్పి చేసి తమ సొంత ఖజానా నింపుకొందురు.
బర్తను బార్య ,తండ్రిని కొడుకు ద్వేషిస్తాడు. ప్రజలంతా పర స్త్రీ కోసం ,పరుల ఆస్తి కోసం ప్రయత్నిస్తుంటారు.
లేగా దూడలు పాలు తాగకుండా ఆ పాలను అమ్ముకుంటారు.
పండితులు విజ్ఞానాన్ని అమ్ముకుంటారు

ఏ ఒక్కని దృష్టి బాగావంతుని పై ఏకాగ్రతగా నిలబడదు.


కలియుగం-తీవ్ర లక్షణాలు

అధిక మంది స్త్రీ పురుషులు శారీరక సుకాల కోసం వేమ్పర్లాడుతూ శృంగార క్రీడల మీద అధికాసక్తులవుతారు.
పండితులు స్వధర్మాన్ని విడిచి పతనమైతే ,శూద్రులు కషాయం ధరించి ,జటా ధారులై ధర్మాన్ని బోధిస్తుంటారు.
సిగ్గు ,లజ్జా ,అబిమానము ,అవమానము ,తప్పు ,అవినీతి ,అక్రమము ,అన్యాయము అనే ఏ ఒక్క దానిని ప్రజలు కాతరు చేయరు.
నమ్మిన వారిని మోసం చేసి చంపుతారు.
మంచి దారిలో ఉన్న వారిని దొంగ దెబ్బ తీసితీస్తారు ,చెడు పనులు చేస్తూ మంచి చేస్తున్నట్లుగా ప్రచారం పొందేవారు ,పైకి ఒకటి లోపల మరొకటి మాట్లాడేవారు ,ధనమధాంద కారము ,పదవి గర్వము ,కుల పిచి మితి మీరిన వారు కష్టపడకుండా అయాచితంగా అతి త్వరగా కుబెరులై పోవాలనుకునే వారు అధికమై పోతారు.


కలియుగాంత లక్షణాలు

కలియుగం నాలుగో పాదం ముగిసి యుగాంతం జరిగే సమయానికి అప్పటి మనుషుల పరమాయువు పదహారు సంవత్సరాలుగా వుంటుంది.అంటే 16 సంవత్సరాలు బతికితే బాగా బతికినట్లుగా పరిగణింప బడుతుంది.
7 లేక 8 సంవత్సరములు మాత్రమే మనుషులు యవ్వన వంతులుగా వుంటారు.
5 సంవత్సారాల వయసుకే స్త్రీలు పిల్లలనుకంటారు.
పుణ్యం అనే మాట ధర్మం అనే వచనం ఎవరి నోటా వినిపించదు.
తల్లి ,తండ్రి ,గురువు ,బార్యా ,బర్తా కొడుకు అనే బంధాలు పూర్తిగా తెగిపోతాయి.
ప్రజలు 10 సంవత్సారాలకే వ్రుద్దులై పోతారు.వేద పండితులు ధర్మం అనే ముసుగు ధరించి చీకటి పనులలో సిద్ధ హస్తులై ,పర స్త్రీ సంగమముతో కులుకుతూ నరకార్హులవుతారు.
ఈ విధంగా సర్వ ధర్మాలు సర్వ నాశనమైన స్థితిలో బూమి పైన సకల సంపదలు కూడా అదృశ్యమై కరువుకాటకాలతో విలయ ప్రలయాలతో కలియుగాంతం జరుగుతుంది.